సురేందర్ రెడ్డి ...ఈ స్టైలిష్ డైరెక్టర్ నందమూరి కళ్యాణ్ రాం హీరోగా నటించిన 'అతనొక్కడే' సినిమా తో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్ నిర్మాతగా అలాగే డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి మొదటి సినిమా 'అతనొక్కడే'. ఈ సినిమాతో ఇద్దరికి సూపర్ హిట్ దక్కింది. ఆ తరవాత మాస్ మహారాజ రవితేజ తో ‘కిక్’ ఎన్.టి.ఆర్ తో ‘ఊసరవెల్లి’ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ‘ధృవ’ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో రేసుగుర్రం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి టాలీవుడ్ లో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. 

 

ఇక లాస్ట్ ఇయర్ మెగాస్టర్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి సైరా తర్వాత మళ్ళీ మరో స్టార్ హీరో సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పటి వరకు సూరి సినిమా కి సంబంధించిన అప్‌డేట్ రాకపోవడం ఆశ్చర్య కరం.

 

ఇక సినీ పరిశ్రమలో సక్సెస్ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. ఒక్కసారి గనక ఫ్లాప్ పడితే ఇక ఆ దర్శకుడిని ఇటు నిర్మాతలు గాని అటు హీరోలు గాని పట్టించుకోరు.. అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపించరు. ఇప్పుడు సురేందర్ రెడ్డి పరిస్థితి అలానే ఉందంటున్నారు. వాస్తవంగా సైరా తర్వాత వెంటనే ప్రభాస్ తో సినిమా చేసేస్తా అనుకున్న సురేంద్రరెడ్డి ఆశలు ఆవిరైపోయాయి.

 

దాంతో ఒక మెట్టు కిందకి దిగి మహేష్ బాబు, నాగచైతన్య, అఖిల్, నితిన్, సాయి ధరం తేజ్ లతో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని ప్రచారం సాగింది. కానీ అవి గాసిప్స్ అని తేలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా సురేందర్ రెడ్డి అల్లు అర్జున్ తో సినిమా కమిటయ్యాడని తెలుస్తుంది. ఇంతకుముందు వీళ్లద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రేసుగుర్రం' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో సూరితో తాజా సినిమాకి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఇది రేస్ గుర్రం సినిమాకి సీక్వెలా కాదా అన్నది త్వరలో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: