టాలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమాను సూరి హ్యాండిల్ చేసిన విధానం చూసి అందరు శభాష అన్నారు. కమర్షియల్ డైరక్టర్ గా తనకంటూ ఒక మార్క్ ఏర్పరచుకున్న సురేందర్ రెడ్డి సైరాతో సత్తా చాటాడు. సైరా తర్వాత వెంటనే అవకాశాలు వస్తాయని అనుకున్నా ఎందుకో వెనుకపడ్డాడు. మెగాస్టార్ తో సినిమా తర్వాత కూడా సురేందర్ రెడ్డి మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక ఈమధ్య సురేందర్ రెడ్డి ప్రభాస్ తో సినిమా చేస్తాడన్న వార్తలు వచ్చాయి. 

 

ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఏమో కానీ లేటెస్ట్ గా సురేందర్ రెడ్డి ప్రభాస్ తో కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఆలా వైకుంఠపురములో సినిమా తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ రఫ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వేణు శ్రీరామ్ డైరక్షన్ లో ఐకాన్ సినిమా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. ఈ రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్ మరోసారి సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమాకు సైన్ చేస్తున్నాడని తెలుస్తుంది. 

 

అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రేసుగుర్రం సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. మరోసారి ఈ ఇద్దరు కలిసి సినిమా అనగానే సినిమా పై కచ్చితంగా అంచనాలు భారీ రేంజ్ లో ఉంటాయి. కథల విషయంలో బన్నీ ఇప్పుడు చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. అల సక్సెస్ ను కొనసాగించేలా సుకుమార్ సినిమాను కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాడట. మరి సుకుమార్ సినిమా రిలీజ్ తర్వాతేసురేందర్ రెడ్డి సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే బన్నీ సినిమా కన్ఫర్మ్ చేసినా లేట్ అవుతుంది కాబట్టి ఈలోగా సురేందర్ రెడ్డి మరో సినిమా చేస్తాడా లేక అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తాడా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: