ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ఆర్.ఆర్‌.ఆర్ చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న ఈచిత్రం విడుద‌ల చేయాల‌ని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఓప‌క్క ఆయ‌న ఈ ప‌నుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే మ‌రో ప‌క్క ఆయ‌న త‌ర్వాత సినిమా గురించి జ‌నాలు అప్పుడే సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చేస్తున్నారు. ఆయ‌న త‌ర్వాత ఈ హీరోతో చేస్తాడు ఆ నిర్మాతతో చేస్తాడు అంటూ తెగ వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఏకంగా హీరోని కూడా వీళ్ళే ఫిక్స్ చేసేస్తున్నారు. హీరో రామ్‌తో త‌న త‌ర్వాత చిత్రం ఉంటుంద‌ని మ‌రికొంత మంది రానా అని అంటున్నారు. ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను కూడా రెడీ చేశారని కూడా రాస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కేవలం అవి ఒట్టి పుకార్లు మాత్రమే అని తెలుస్తోంది.

 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వ‌స్తున్న ఈ చిత్రానికి  రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఉగాది సందర్భంగా మోషన్ పోస్టర్ తో కూడుకున్న టైటిల్ లోగోను ఈ రోజు రిలీజ్ చేయనున్నారు. రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రం అప్ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

ఇక రాజ‌మౌళి సినిమాలంటే ఉండే క్రేజే వేరు. ఆ విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న ఒక్కో సినిమాకి దాదాపు రెండేళ్ళు స‌మ‌యాన్ని తీసుకంటారు. ప్రేక్ష‌కుల్లో కూడా అదే విధంగా క్రేజ్‌ని తీసుకొస్తారు. రెండేళ్ళ పాటు ఆ సినిమాకి ప్ర‌మోష‌న్ జ‌రుగుతూనే ఉంటుంది. ఈ విధంగా ఒక ప్ర‌త్యేక‌మైన పంధాలో రాజ‌మౌళి వెళ‌తారు. ఇక ఈ చిత్రం ఎక్క‌డా కూడా గ్యాప్ లేకుండా చేద్దామ‌నుకున్న రాజ‌మౌళికి ఈ క‌రోనాతో కాస్త బ్రేక్ ప‌డింద‌నే చెప్పాలి. దీంతో ఎక్క‌డివారు అక్క‌డ స్వియ నిర్బంధ‌న‌లో ఉండిపోయారు. మ‌రి ఫిక్ష‌న్ డ్రామాగా కొన‌సాగే ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు క‌ళ్ళు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: