బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తెలుగు సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. బాహుబలిని హిందీలో ప్రెజెంట్ చేసినప్పటి నుండి కరణ్ జోహార్ కి తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. అందుకే తెలుగు సినిమాల మీద ఓ కన్నేసి ఉంచుతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది.

 


అదే కాదు మొన్నటికి మొన్న వచ్చి తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో తెరకెక్కిస్తాడని వార్తలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకి అంతగా రుచించని ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులకి బాగా రుచిస్తుందని కరణ్ జోహార్ నమ్ముతున్నాడట. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి చేతిలో మరో తెలుగు సినిమా రీమేక్ హక్కులు ఉన్నాయట.

 


సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన భీష్మ చిత్రాన్ని బాలీవుడ్ లో కరణ్ జోహార్ రీమేక్ చేయనున్నాడట. రణ్ బీర్ కపూర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. ఈ చిత్రం తెలుగులో ఓ మోస్తారు విజయం సాధించింది. కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేయకపోవడం వల్ల బ్లాక్ బస్టర్ కావాల్సిన చిత్రం ఎబోయ్ యావరేజ్ గా ఆగిపోయింది.

 


అయితే భీష్మ చిత్రం బాలీవుడ్ లో వర్కౌట్ అవుతుందా లేదా అన్నది సందేహంగా ఉంది. ఇప్పటి వరకు తెలుగు నుండి హిందీలో రీమేక్ అయిన చిత్రాలు మంచి విజయాల్నే సాధించాయి. కబీర్ సింగ్ అయితేనేమి, టెంపర్ అయితేనేమీ అక్కడ మంచి విజయం సాధించాయి. భీష్మ కూడా అక్కడి జనాలకి బాగా నచ్చుతుందని నమ్ముతున్నారు. చూడాలి ఏమవుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: