టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడిగా కెరీర్ మొదలు పెట్టిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘బద్రి’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ మూవీలో పవన్ మానరీజానికి సరిగ్గా సెట్ అయ్యింది.. ఓ పవర్ ఫుల్ ప్రేమికుడి పాత్రలో పవన్ కళ్యాన్ని కొత్తగా చూపించాడు పూరి జగన్నాథ్. ఇక మాస్ మహరాజ రవితేజ తో ‘ఇడియట్’ సినిమా తీశాడు.  లోకల్ చంటిగాడు అంటూ కమిషనర్ కి ఎదిరించి పోరాడే ప్రేమికుడిగా చూపించాడు.  ఇక క్యూట్, లవర్ బాయ్ గా ఉన్న మహేష్ బాబుని ‘పోకిరి’ మూవీతో మాస్ హీరోగా చూపించాడు. ఇలా ప్రతి ఒక్క హీరోని తనదైన స్టైల్లో చూపిస్తూ వచ్చారు.  అయితే రవితేజకు శ్రావణి సుబ్రహ్మణ్యం , ఇడియట్ , అమ్మా నాన్నతమిళ అమ్మాయి లాంటి సూపర్ హిట్ మూవీస్ అందించిన పూరి జగన్నాథ్ మరోసారి రవితేజతో ఓ మూవీ తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  

 

అమ్మా నాన్నతమిళ అమ్మాయి  తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరోసినిమా రాలేదు.. ఫ్యాన్స్ కూడా వీరిద్దరి కాంబినేసన్ లో ఓ సినిమా రావాలని కోరుకుంటున్నారు.  రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు ఒక్క హిట్ కూడా లేదు. గత ఏడాది రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పూరిజగన్నాథ్.  ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రవితేజ కోసం ఇప్పటికే కథ కూడా రెడీ చేసి వినిపించాడట పూర్తి కథను సిద్ధం చేసి రవితేజతో సినిమా చేయాలనీ చూస్తున్నాడు పూరి.

 

ఈ సినిమాకు కూడా ఛార్మి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.  తాజాగా గోపిచంద్  మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటు త్రినాద్ నక్కిన దర్శకత్వంలో ఓ  సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి సినిమా ఉండే అవకాశం ఉంది. త్వరలోనే  రవితేజ ,పూరి  సినిమా పై ఓ క్లారిటీ రానుంది . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: