'సైరా నరసింహారెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఆచార్య'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పినప్పుడు చిత్రంలోని మరో కీలక పాత్ర గురించి స్పెషల్ గా చెప్పాడట. చిరంజీవి కథ ఓకే చేయడానికి ఈ పాత్ర కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయం మీద చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడింది. మహేష్ కి ఈ పాత్ర నచ్చి ఓకే చేసినట్లు వార్త వచ్చింది. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు మహేష్ ఆచార్య సినిమాలో నటించడం లేదని అనుకుంటున్నారు.

 

ఇప్పుడు ఆ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా ఇదే కంఫర్మ్ అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ పాత్రకి సంభందించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర చిత్ర కథను మలుపు తిప్పుతుందట. ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తోనే ఆచార్య తన గమ్యాన్ని ఏర్పరచుకుంటాడట.

 

ఈ సినిమాలో దాదాపు 30 నిడివి ఉండే ఈ క్యారెక్టర్ చనిపోతుందని సమాచారం. రామ్ చరణ్ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాకుండా ఒక సాంగ్ లో చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటిస్తారంట. ఇదే కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ లో తన పాత్ర షూటింగ్ ముగించుకొని ఆచార్య మూవీ షూటింగులో పాల్గొంటాడని సమాచారం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తండ్రీకొడుకులు నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాయబోతుందో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: