ఆర్ఆర్ఆర్... ఇప్పుడు ఈ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలనం. టాలీవుడ్ జనాలు ట్రిపుల్ ఆర్ కోసం ఎదురు చూసినట్టు గా ఈ మధ్య కాలంలో మరో సినిమా కోసం ఎదురు చూడలేదు. ఈ సినిమా టాలీవుడ్ లో చరిత్రలోనే కొత్త చరిత్ర సృష్టిస్తుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ సినిమా కోసం రాజమౌళి తీవ్రంగా కష్టపడుతున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్సినిమా కోసం ఎంతో తీవ్రంగా కష్టపడుతున్నారు. మరో సినిమా గురించి కూడా దాదాపుగా ఆలోచించడం లేదు ఆ ఇద్దరు హీరోలు. 

 

సినిమా కోసం ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. అయితే ఇప్పుడు కరోనా కోసం లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాలీవుడ్ అంటుంది. రాజమౌళి కూడా ఇప్పట్లో షూటింగ్ వద్దనే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 

 

ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ విడుదల అయిన వెంటనే యుట్యూబ్ ఒక రకంగా షేక్ అయింది అనే చెప్పవచ్చు. నిమిషాల వ్యవధిలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. లక్షల వ్యూస్ సాధించింది. ఈ క్రేజ్ చూసి సోషల్ మీడియా తో పాటుగా టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యారు. ఆ రేంజ్ లో దాని కోసం ప్రేక్షకులు ఎదురు చూసారు. దీనికే ఇంత క్రేజ్ ఉంటే సినిమాకు ఏ స్థాయిలో ఉండవచ్చు అనేది అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: