సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ బాబు కి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమా మీద సూపర్ స్టార్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాని ఈ సినిమా వసూళ్ళ తో పాటుగా అన్ని విధాలుగా చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చింది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. నోటి ప్రచారం కూడా సినిమాను బాగా ఇబ్బంది పెట్టింది అనేది కూడా వాస్తవం. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరి తో సినిమా చెయ్యాలి అనే దాని మీద ఒక అంచనాకు రాలేకపోతున్నాడు అనేది అర్ధమవుతుంది. మహేష్ ముగ్గురు దర్శకులతో మాట్లాడినా సరే ఎవరూ కూడా ముందుకి రాలేదు. 

 

వంశీ పైడపల్లి దర్శకత్వంలో సినిమా చెయ్యాలని చూసినా సరే ఆ సినిమా కథ మహేష్ కి నచ్చలేదు. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని చూసాడు. ఆ సినిమా కూడా అవ్వలేదు. ప్రస్తుతం అతను పరుశురాం తో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. ఈ సినిమా కథను దాదాపుగా ఓకే చేసాడు మహేష్. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చెయ్యడానికి మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. అయితే దర్శకుడు మాత్రం ఈ సినిమా కథ కు ఇంకా సమయం పడుతుంది అని మహేష్ తో చెప్పినట్టు సమాచారం. మహేష్ బాబు మాత్రం త్వరగా పూర్తి చేస్తే కరోనా తగ్గిన తర్వాత మొదలు పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. 

 

అయితే ఈ సినిమా ఆలస్యం అవ్వడం ఖాయమని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా మహేష్ తో చెప్పినట్టు సమాచారం. షూటింగ్ ఇప్పట్లో మొదలు అయ్యే అవకాశాలు దాదాపు గా లేవని కాబట్టి షూటింగ్ కారణం గా వాయిదా పడుతుంది అని చెప్పినట్టు తెలుస్తుంది. కాని మహేష్ మాత్రం ఇప్పుడు ఈ సినిమా మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: