కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కరోనా పుట్టినట్లుగా చెప్పుకుంటున్న చైనా మెల్లమెల్లగా కోలుకుంటున్న సమయంలో ఎంతో శక్తివంత దేశాలైన అమెరికా, ఇటలీ వంటి దేశాలు కరోనా ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. ఇటలీ, ఇరాన్ సౌత్ కొరియా వంటి దేశాల్లో కరోనా విశ్వరూపం చూపిస్తుంది. కరోనా కారణంగా ఇండియా మొత్తం ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.

 

 

అయితే ఈ లాక్ డౌన్ ని తెలంగాణలో కొందరు సీరియస్ గా తీసుకోవట్లేదు. రోడ్లమీదకి రావద్దని ఎంత చెబుతున్నా కూడా జనం రోడ్లమీదకి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జనాల్ని రోడ్లమీదకి రావొద్దంటూ నిన్నటి ప్రెస్ మీట్ లో కొంచెం సీరియస్ గా చెప్పాడు. చెప్పడం కంటే వార్నింగ్ ఇచ్చాడనే చెప్పాలి. ఎంతబాగా చెప్పినా ఇళ్లలో నుండి బయటకి వస్తున్నారు. ఇలాగే ఉంటే పెట్రోల్ బంకులు మూసివేస్తాం.. అయినా సరే వినకుంటే కనిపిస్తే కాల్చివేస్తాం అనే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

 


కనిపిస్తే కాల్చివేస్తాం అన్న మాటలు బాగా వైరల్ అయ్యాయి. అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఇళ్ళలోనే ఉండడని చెప్పినప్పటికీ కేసీఆర్ చెప్పిన విధానం కొంతమందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ కన్ఫ్యూజన్ లో ఉందట. అదేంటని ఆశ్చర్యపోతుందట. ఇది నిజంగా నిజమేనా అంటూ సోషల్ మీడియా ద్వారా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

 

 

అయితే అలా ఆశ్చర్యపోతున్న సోనమ్ కపూర్ కి నెటిజన్లు సమాధానం ఇచ్చారు. చెప్పిన మాట వినకుండా వైరస్ ని అదుపుచేయడంలో అడ్డంకులు సృష్టిస్తే అలాంటి పని చేయడమే కరెక్టని అంటున్నారు. మరి ఇప్పటికైనా సోనమ్ కపూర్ కి సరిగ్గా అర్థం అయిందో లేదో..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: