బాలీవుడ్ హాట్ పెయిర్ సెల్ఫ్ క్వారంటైన్ ను ఆస్వాదిస్తోంది. మ్యారేజ్ తర్వాత రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే ఎవరి షూటింగ్స్ తో వారు బిజీగా గడిపారు. ఇప్పుడు కరొనా ఎఫెక్ట్ తో దొరికిన ఖాళీ సమయాన్ని ఈ బాలీవుడ్ కపుల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట సెల్ఫ్ క్వారంటైన్ ఆడియన్స్ ను అలరిస్తోంది.

 

బాలీవుడ్ హాట్ పెయిర్ రణ్ వీర్ సింగ్, దీపీకా పదుకొనేల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ లీలా బాజీరావ్ మస్తానీ, పద్మావత్ లాంటి సినిమాల్లో సూపర్ కెమిస్ట్రీ వర్కవుట్ చేశారు. ఆన్ స్క్రీ కెమిస్ట్రీతో దగ్గరయిన ఈ జోడీ.. ఆఫ్ స్క్రీన్ లో పెళ్లాడి ఒక్కటయ్యారు. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ఈ జోడీ ఎవరి సినిమా షూటింగ్స్ తో వారు బిజీగా గడిపారు. కానీ ఇపుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఈ హాట్ జోడీకి అనుకోని విధంగా కావాల్సినంత టైమ్ దొరికింది. 

 

కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో సెలబ్రిటీలు స్వీయ నిర్భంధంలో ఉన్నారు. తాజాగా హాట్ కపుల్స్ రన్ వీర్ సింగ్ దీపికా పదుకొనే కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. స్వీయ నిర్భంధంలో ఉన్న ఈ జంట కాలక్షేపం కోసం తమ ఇంట్లో జిమ్మింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో భార్యాభర్తలిద్దరూ రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో ఫోటో కు ఫోజులిచ్చారు. ఈ ఫోటో ఇపుడు వైరల్ అవుతోంది.

 

ప్రస్తుతం రన్ వీర్ సింగ్, దీపికా పదుకొనే 83బయోపిక్ లో నటిస్తున్నారు. 1983లో ఇండియా గెలిచిన క్రికెట్ వరల్డ్ కప్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రన్ వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన లైఫ్ రోమీ దేవ్ క్యారెక్టర్ దీపికా పదుకొనే నటిస్తోంది. పెళ్లి ముందు ఈ జోడీ నటించిన మూడు సినిమాలు బంపర్ హిట్ గా నిలిచాయి. దీంతో పెళ్లి తర్వాత తొలిసారిగా ఈ జంట కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: