నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంట్లో ఉంటూ తన టాలెంట్ చూపిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరిలానే సిని సెలబ్రిటీస్ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక అందరితో పాటుగా నాని ఇంట్లో ఉంటూ కొత్తగా వంట నేర్చుకుంటున్నాడు. ఆల్రెడీ బ్యాచిలర్ గా ఉన్నప్పుడు వంట వండటం అలవాటు ఉన్న నాని చాలా కాలం తర్వాత వంటింట్లో కూర వండుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాని మసాలా శనగ కర్రీ వండినట్టు తెలుస్తుంది. ఇంట్లో వాళ్లకు తన వంట రుచి చూపించి తన ఈ కొత్త టాలెంట్ ఓ సర్ ప్రయిజ్ చేస్తున్నాడు నాని. 

 

నాని మాత్రమే కాదు ఇలా ఇంట్లో ఉంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేసే పనిలో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నట్టు తెలుస్తుంది. వెన్నెల కిషోర్ ఆల్రెడీ ఇంట్లో ఊడుస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇక మిగతా స్టార్స్ కూడా ఇంట్లో కొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు. స్టార్స్ సైతం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంట్లోంచి కాలు బయట పెట్టట్లేదు కానీ ప్రజలు మాత్రం ఇంకా కరోనా గురించి లైట్ తీసుకుంటున్నారు. వాళ్లకు కావాల్సిన నిత్యావసరాల కోసం టైం ఒకటి ఫిక్స్ చేసినా ఆ పని కోసం కాకుండా కొందరు కావాలని బయటకు రావడం వాళ్లపై పోలీసులు వెంటపడటం తెలిసిందే. 

 

పీఎం మోడీ ప్రకటించినట్టుగా ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటుంది. ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండటమే కరోనా బారిన బాడకూండా ఉండే ఏకైక మార్గమని తెలుస్తుంది. అయితే స్టూడెంట్స్, వర్కింగ్ పీపుల్ హాస్టల్స్ నుండి ఖాళీ చేసి తమ ఇళ్లకు వెళ్లేలా ఈ ఒక్కరోజు టైం ఇచ్చినట్టు తెలుస్తుంది. కరోనా ప్రభావం ఎక్కువ కాకుండా ప్రభుత్వ సూచలనాలు పాటించాలని అందరు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: