స్టైలిష్స్టార్ అల్లుఅర్జున్ ఇటీవలె నటించిన అలవైకుంఠపురంలో చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఆయన క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్య, ఆర్య 2 బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సుకుమార్ తో ప్రస్తుతం ఆయన ఓ కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో బన్నీ ఓ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడటానికి కారణం కూడా ఇదే. అయితే ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్ ఐకాన్ చిత్రాన్ని చేయనున్నారు. వేణు శ్రీరామ్ ఇప్పటికే క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ నీ కూడా బన్నీ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
రేసు గుర్రం, ధ్రువ, సై రా నరసింహ రెడ్డి ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సురేందర్ రెడ్డి తన తర్వాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కి వరుస విజయాలను అందిస్తున్న సురేందర్ రెడ్డి మరొక సారి అల్లు అర్జున్ తో చేయడం తో రేసు గుర్రం తరహాలో అంచనాలు నెలకొనే అవకాశం ఉందని సమాచారం. అల్లు అర్జున్ సైతం సుకుమార్ సినిమా తర్వాత ఐకాన్ తో పాటు ఈ చిత్రంలో కూడా ఓకే సారి నటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఈ వార్తలు వస్తున్నాయి. మరి దీని పై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.
కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసిన సినిమా మంచి హిట్ కావడంతో ప్రస్తుం ఆయన ఫుల్ జోష్లో ఉన్నారు వరుస సినిమాలు చేసే బిజీలో ఉన్నారు స్టైలిష్స్టార్ అల్లుఅర్జున్. ఇక సుకుమార్ చిత్రంలో రష్మిక మండన్న నటిస్తున్నట్లు సమాచారం. ఆతర్వాత చేయబోయే చిత్రంలో పూజా హెగ్డే నటిస్తోంది.