టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హిరోయిన్స్ రేస్ లో ఉంది కన్నడ బ్యూటి రష్మిక మందన్న. పూజా హెగ్డే తో పోటీ పడి మరి ఛాన్సులు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా యంగ్ హీరో నితిన్ తో నటించిన భీష్మ కూడా ఈ బ్యూటికి సక్సస్ ని ఇచ్చింది. దాంతో ఫుల్ ఫాం లో ఉంది రష్మిక. ఇక కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా 'కిరాక్ పార్టీ'. ఈ సినిమా తోనే రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమలో పాపులర్ అయింది. 'కిరాక్ పార్టీ' సక్సస్ తోనే రష్మిక టాలీవుడ్ లో వెంకీ కుడుముల నాగ శౌర్య తో తెరకెక్కించిన 'ఛలో' సినిమాలో అవకాశం ఇచ్చాడు.

 

తెలుగులో ఈ సినిమా మంచి హిట్ ని అందుకోవడం తో రష్మిక కి వరుసగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు... ఇలా వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో సెటిలయింది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రక్షిత్ శెట్టి కిరాక్ పార్టీ కి సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సీక్వెల్ కి అందరు పార్ట్ వన్ కి చేసిన వాళ్ళనే ఎంచుకున్నాడట రక్షిత్. దీంతో అటు కన్నడ చిత్ర పరిశ్రమలో ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరు సీక్వెల్ లో రక్షిత్ శెట్టికి జోడీగా రష్మిక మందన్న నటిస్తుందని అనుకున్నారు.

 

కాని అది అంతా అయ్యో పని కాదని తాజా సమాచారం. కిరాక్ పార్టీకి సీక్వెల్ ని చేస్తున్నప్పటికి అందులో రష్మిక మాత్రం నటించబోదని రక్షిత్ తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే అందుకు కారణం కిరాక్ పార్టీ సమయంలో రక్షిత్, రష్మిక లవ్ లో పడ్డారు. పెళ్ళి కూడా చేసుకోవలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో హీరోయిన్ గా పాపులారిటి రావడంతో రక్షిత్ తో తెగతెంపులు చేసుకుంది రష్మిక. ఆ కారణంతోనే రక్షిత్ రష్మిక ని లైట్ తీసుకున్నాడని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: