టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి రైటర్ నుండి నుండి డైరెక్టరుగా మారిన వాళ్ళని నిర్మాతలు గాని హీరోలు గాని చాలా స్పెషల్ గా చూస్తారు. ఒక కథ వినాలంటే నిర్మాతలు, హీరోలు ముందు వీళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళలో కొరటాల శివ, బోయపాటి శ్రీనుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. అయితే ఈ ఇద్దరూ పోసాని దగ్గర రాటు తేలి వచ్చినవాళ్ళే. ఇక బోయపాటి డెబ్యూ సినిమా 'భద్ర' తో మాస్ డైరెక్టర్ గా మంచి పేరు ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బాలయ్య, వెంకటేష్, రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్... లాంటి పెద్ద స్టార్ హీరోల తో సినిమాలు తీసి  బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు.

 

అంతేకాదు సింహా, లెజెండ్, సరైనోడు సినిమాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వినయ విధేయ రామ మాత్రం భారి డిజాస్టర్ గా నిలిచింది. ఆ దెబ్బకి బోయపాటి టాలీవుడ్ లో అన్ని రకాలుగా దెబ్బ తిన్నాడు. ప్రస్తుతం బోయపాటి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ప్రభాస్ తో తెరకెక్కించిన 'మిర్చి' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో డైరెక్టరుగా టాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు కొరటాల శివ. ఈ ఒక్క సినిమా సక్సస్ టాలీవుడ్ ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాకుండా పోయింది. మిర్చి తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు కొరటాల. ఈ ఊపుతోనే ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమాని తెరకెక్కిస్తున్నారు.

 

అయితే బోయపాటి శ్రీను కి టాలీవుడ్ లో ఇంత సక్సెస్ రావడానికి కొరటాల కూడా ఒక కారణమని చెప్పాలి. భద్ర సినిమా కథ కొరటాల వ్రాయగా ఆ క్రెడిట్ మొత్తం బోయపాటి తీసుకున్నాడని గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా కొరటాలే వెల్లడించారు. కొరటాల దర్శకుడయ్యాక వరుసగా బ్లాక్ బస్టర్స్ ని సాధిస్తూ బోయపాటికి చెక్ పెట్టాడని చెప్పక తప్పదు. ఇక ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న బాలయ్య, చిరంజీవి సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయని తాజా సమాచారం.

 

కరోనా నేపథ్యంలో అన్ని సినిమాల షూటింగ్స్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎఫెక్ట్ ఇలా పడింది. ఈ ఇద్దరు చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారట. ఇద్దరు పెద్ద హీరోలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ పోటీ ఒక రకంగా ఈ సినిమా దర్శకులైన కొరటాల బోయపాటి మధ్య అని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: