అనసూయ భరద్వాజ్  ప్రముఖ నటి, యాంకర్ కూడా. అనసూయ తనదైన  నటనతో ప్రేక్షకులని ఉర్రుతలూగిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా  యాక్టివ్‌గా ఉంటుంది. ఒక్కోసారి తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది. అలాగే అనసూయతో పాటు కొంతమంది సెలబ్రిటీల  కూడా సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. వీళ్ళు పెట్టె పోస్టులకి  కొంతమంది నెటిజన్లు తమకి ఇష్టం వచ్చినట్లు మెసేజెస్ పెడుతుంటారు.

 

ఒక విధముగా చెప్పాలంటే  ఇది సెలబ్రిటీల  సహనానికి పరీక్ష  అన్నమాట. కొంతమంది నెటిజన్లు కు ఘాటయిన సమాధానాలతో  రిప్లై ఇస్తారు.  మరికొంత మంది అయితే నోటికొచ్చినట్టు మాట్లాడి నెటిజన్లకు అడ్డంగా దొరికేస్తుంటారు. యాంకర్ అనసూయ, రష్మి, మాధవీలతా, శ్రీరెడ్డి లాంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా  యాక్టివ్‌ గా ఉంటారు.   శ్రీరెడ్డి  గూర్చి అయితే అసలు చెప్పాలిసిన పనే లేదు. ఆవిడా రూటే సెపరేటు.

 

ఇప్పుడు  అనసూయ కూడా ఒక ట్వీట్ చేసింది. దానికి నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  అయితే కొన్ని సందర్భాల్లో చెప్పే విధానం సరిలేక.. అది నెటిజన్లకు సరిగా కన్వే కాక.. నానా తిప్పలు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో నెటిజన్ల నుండి ట్రోల్స్‌కి గురౌతుంటారు. వివాదాల్లో ఇరుకుంటారు.అయితే అసలు అనసూయ చేసిన ట్వీట్ ఏంటో చూద్దామా! అనసూయ కరోనా విషయంలో  ఒక  ట్వీట్  చేసి సోషల్ మీడియాలో హీట్ పుట్టించింది.  

 

ప్రజలు  అందరు  లాక్ డౌన్‌ చేస్తుంటే, అనసూయ మాత్రం" లాక్ డౌన్ లో భాగంగా తమకు మినహాయింపు కల్పించాలని కేటీఆర్‌కి ట్వీట్ చేయడంతో" ఆమెపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి. అయితే పలుసందర్భాల్లో నెటిజన్లకు అనసూయకు మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ వార్ నడుస్తుంటుంది. ఆ సందర్భంలో అనసూయ సహనం కోల్పోతూ నెటిజన్లుకు ఘాటుగా సమాధానం ఇస్తుంటుంది అనసూయ.

 

అయితే  ఈ సారి  అనసూయ  ఉగాది సందర్భంగా ప్రజలకు ఉగాది  శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘సహనం’ అంటే ఏంటో క్లాస్‌లు చెప్తోంది. ‘సహనం అంటే.. వేచి ఉండగల సామర్థ్యం కాదు.. మంచి వైఖరిని కనబరిచే సామర్థ్యం’ అంటూ సోషల్ మీడియాలో సహనం కోల్పోతూ పోస్ట్‌లు పెట్టే అనసూయ పండగ పూట సహనపూరితంగా పోస్ట్ పెట్టడం విశేషం అనే చెప్పాలి.  అలాగే తను యాంకరింగ్ చేసే ప్రతిరోజు పండగే ఎపిసోడ్స్ ని మిస్ అవ్వకుండా చూడాలని  తెలిపింది.

 

ఈ షో ఈటీవీలో మధ్యాహ్నం పూట ప్రసారం అవుతుంది. అయితే ఈ షో కి అనసూయ సాంప్రదాయ దుస్తుల్లో లంగాఓణీలో అచ్చమైన ఆడపిల్లల దర్శనం ఇచ్చి అందరి మతి పోగొట్టింది. అయితే  ఎప్పుడు పొట్టి పొట్టి బట్టల్లో హాట్ పుట్టించే అనసూయ ఈ సారి ఉగాది సందర్భంగా లంగాఓణీలో అదరగొట్టింది. దీనితో నెటిజన్లు అనసూయని చూసి తెగ మురిసిపోతున్నారు. అనసూయ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో బాగున్నావ్ అంటూ కితాబు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: