టాలీవుడ్ లో ఓటమి అంటే ఏంటో తెలియని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తీశారు. అందులో    టాలీవుడ్ స్థాయిని దశదిశలా చాటి చెప్పేలా ఆయన ‘బాహుబలి,బాహుబలి2’తెరకెక్కించారు.  బాహుబలి 2 జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఓ మల్టీస్టార్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఈ మూవీ పేరు ఏంటీ అన్నది నిన్నటి వరకు సస్పెన్స్ గా ఉంటూ వచ్చింది.  ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ తో ఇప్పటి వరకు పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చాయి.

 

నిన్న ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా మూవీ టైటిల్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మోషన్ పోస్టర్ లో గ్రాఫిక్స్ మాయాజాలం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.  నీటి నుంచి వస్తున్న ఎన్టీఆర్.. నిప్పు నుంచి వస్తున్న రామ్ చరణ్ ఇద్దరూ ఎంతో రౌద్రం గా కనిపిస్తున్నారు.   'రౌద్రం రణం రుధిరం'  మోషన్ పోస్టర్ చూస్తుంటేనే మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం అవుతుంది.  ఇక మెగా, నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి.. అప్పుడే యూట్యూబ్ సంచలనాలు మొదలు పెట్టింది.

 

మోష‌న్ పోస్ట‌ర్‌ లను నిన్న విడుదల చేయగా, మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో స్పందించారు.మోషన్ పోస్టర్ కనువిందుగా ఉంది. నా ఒళ్లు గ‌గుర్పొడిచింది. కీర‌వాణి అద్భుత‌మైన సంగీతాన్ని, నేప‌థ్య సంగీతాన్ని అందించారు. రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, తార‌క్ ప‌నితీరు అద్భుతంగా ఉంది. ఈ ఉగాది రోజున అంద‌రిలో ఎన‌ర్జీని నింపారు" అని కామెంట్ పెట్టారు. ఏది ఏమైనా నిన్నటి మోషన్ పోస్టర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా మరో రీకార్డు క్రియేట్ చేసేలా ఉందనిపిస్తుంది. ఇక  రాజమౌళి సమాధానం ఇస్తూ, "సర్.. మీరు ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఉగాది శుభాకాంక్ష‌లు. ట్విట్ట‌ర్‌ కు స్వాగ‌తం" అని ట్వీట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: