చిరంజీవి షూటింగ్ లేక ఇంటిలో గృహ నిర్భంధంలో ఉన్నా నిన్నటి నుంచి సోషల్ మీడియాలోకి ఎంటర్ కావడంతో ప్రతిరోజు చిరంజీవి వైపు నుంచి అనేక విషయాల పై ఆయన అభిప్రాయాలు ఉంటాయి అన్న సంకేతాలు ఈరోజు కూడ వచ్చాయి. తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఈరోజు చిరంజీవి తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసాడు.


ప్రస్తుతం కరోనా సమస్య తీవ్ర స్థాయికి చేరుకోవడంతో తన అభిమానులు అంతా తమ తల్లి తండ్రులను జాగ్రత్తగా చూసుకోమని చిరంజీవి పిలుపు ఇచ్చాడు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా విపత్కర సమస్యల నుండి ఎవరికీ వారు తమ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి అంటూ చిరంజీవి మొత్తం తెలుగు ప్రజలకు తన సందేశాన్ని చేరవేసేలా ప్రయత్నిస్తున్నాడు. 


సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిన పరిస్థితులలో చిరంజీవి చెపుతున్న కరోనా జాగ్రత్తలు వెంటనే వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి ట్విటర్ అకౌంట్ కు కేవలం ఒక్క రోజులో లక్షమంది ఫాలోయర్స్ అనుసరిస్తూ ఉంటే చిరంజీవి ఇన్ ష్టా గ్రామ్ అకౌంట్ కు కేవలం ఒక్క రోజులో 438కె ఫాలోయర్స్ ఏర్పడటం అతడి మెగా స్టార్ మ్యానియాను సూచిస్తోంది. 


ఇప్పుడు సినిమాల హడావిడి లేకపోయినా ఎక్కడ చూసినా చిరంజీవి సోషల్ మీడియా హడావిడి కనిపిస్తున్న పరిస్థితులలో సోషల్ మీడియా మెగా స్టార్ గా కూడ చిరంజీవి మారిపోయాడు. తల్లి తండ్రుల పట్ల ఇంట్లోని ఇతర పెద్దల పట్ల నేటి తరానికి శ్రద్ధ బాగా తగ్గిపోయింది అని కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో చిరంజీవి కుటుంబ వ్యవస్థ గురించి ముఖ్యంగా తల్లితండ్రుల ప్రాముఖ్యత గురించి చెపుతున్న విషయాలు ఎంత వరకు నేటితరం ఆలోచనలు ప్రభావితం చేస్తాయో చూడలి. ‘సైరా’ తో అనుకున్న రికార్డులను చిరంజీవి అందుకోలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవి ఒక అరుదైన రికార్డుల వైపు అడుగులు వేస్తున్నాడు అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: