ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్లు ఎవరని అంటే గుర్తొచ్చే రెండు పేర్లలో మొదటి పేరు పూజా హెగ్డే ఉంటుంది. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ భామ మొదట్లో అన్నీ ఫ్లాపులని మూటగట్టుకుంది. ఒక దశలో ఐరన్ లెగ్ గా అనిపించుకుంది కూడా. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గిర్రున తిరిగేసరికి మొత్తం అంతా రివర్స అయింది. ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఆమెవైపే చూస్తుంది.

 

అరవింద సమేత,  గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో వంటి హిట్ల తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతీ స్టార్ హీరోకి ఆమె చాయిస్ లా మారిపోయింది. ప్రస్తుతం పూజాహెగ్డే ప్రభాస్ సరసన ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. మొన్నటికి మొన్న జార్జియాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ని వాయిదా వేసుకుంది.

 


బాలీవుడ్ లోనూ పూజాహెగ్డేకి మంచి ఫేమ్ ఉంది. హృతిక్ రోషన్ సరసన మొహంజొదారో చిత్రంలో నటించిన ఆమెకి సక్సెస్ రాకపోయినప్పటికీ సల్మాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇటు ప్రభాస్ తో పాన్ ఇండియా చిత్రం, అటు బాలీవుడ్ బాద్ షాతో హిందీ చిత్రం.. రెండింటిలో నటిస్తున్న పూజా నేషనల్ లెవెల్లో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. అయితే ఆ రేంజ్ ఇంకా రాకపోయినా టాలీవుడ్ లో టాప్ లో కొనసాగుతున్న పూజాకి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమాతో మంచి పారితోషికం అందుతోందట.

 

అక్కినేని అఖిల్ నటిస్తున్న ఈ చిత్రంలో హీరో కంటే ఎక్కువ పూజాకే ఇస్తున్నారని టాక్. ఇదే గనక నిజమైతే పూజాని తెలుగులో నటింపజేయాలంటే నిర్మాతలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. హిందీలోనూ అవకాశం వస్తుండడంతో తెలుగులో తక్కువ సినిమాలు చేద్దామనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తుందేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: