టాలీవుడ్ లో వర్షం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ త్రిష.  మొదట మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన త్రిష తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఇలా మొదటి సినిమ మాలీవుడ్ లో నటించినప్పటికీ తెలుగు లో ప్రభాస్ నటించిన ‘వర్షం’ సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఇలా తెలుగు, తమిళ, మళియాళంలోవరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకొని నెంబర్ వన్ పొజీషన్ లోకి వచ్చింది.  ఈ అమ్మడు వెండితెరకు పరిచయం అయి పన్నెండేళ్లు దాటినా.. ఇప్పటికీ గ్లామర్ గానే కనిపిస్తుంది.  

 

ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్.. హర్రర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపిస్తుంది.  ఇలాంటి పాత్రలు చేయాలంటే కాస్త గట్స్ ఉండాలన్న విషయం తెలిసిందే. తెలుగులో పూర్తిగా కనుమరుగైన ఆమె, తమిళ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తోంది. కొంత కాలంగా తెలుగు లో త్రిష కి పెద్దగా ఛాన్సులు రావడం లేదని అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా నిలదొక్కుకున్నదే తెలుగు సినిమాలతో. అలాంటప్పుడు తెలుగు సినిమాలు చేయనని ఎందుకంటాను? ఆ మధ్య తెలుగు నుంచి ఒక ఆఫర్ వస్తే, డేట్స్ కుదరక చేయలేనని చెప్పాను. దాంతో తెలుగులోనే చేయదట అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ అస్సలు నమ్మొద్దు అంటుంది త్రిష. 

 

ఇదంతా పుకారు మాత్రమేనని చెప్పడమే నా ఉద్దేశం. ప్రస్తుతం మలయాళ సినిమాలతో బిజీగానే వున్నాను. మీడియా అన్న తర్వాత రక రకాల పుకార్లు వస్తుంటాయి.. అవన్నీ సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టర్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో త్రిష కి ఛాన్స్ వచ్చినప్పటికీ.. ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే రెమ్యూనరేషన్ విషయంలోనే తేడా వచ్చిందని వార్తలు వచ్చాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: