ఈ ఉగాది పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్స్ ఓపెన్ చేశారు. మెగా అభిమానులతో పాటు నాగార్జున, మహేశ్, తమన్నా, పూరి జగన్నాధ్, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరకూ ఎందరో ఆయన రాకను స్వాగతించారు. కానీ.. క్రేజ్ లో ఫ్యాన్స్ లో ఆయన సమకాలీకుడైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఆయకు ఎటువంటి వెల్ కమ్ పోస్ట్ చేయలేదు. కమల్ హాసన్, విజయ్, సూర్య.. వంటి వారు కూడా ఏ పోస్ట్ చేయలేదు.

 

 

దీనికి నెటిజన్లు పలు కారణాలు చెప్తున్నారు. రజినీ పదేళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్నాడు. చిరంజీవి సినిమాల్కి రీబ్యాక్ అయ్యాక చేసిన రెండు సినిమాలు 100 కోట్ల షేర్ సాధించాయి. ఆచార్య సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రజినీ చేస్తున్న అన్నాతై మీద పెద్ద అంచనాలు లేవు. ఈ వయసులో రజినీ కంటే చిరంజీవి చాలా యాక్టివ్ గా డ్యాన్సులు వేస్తున్నాడు. చిరంజీవిలోని ఈ క్వాలిటీస్ ఆయనకు ఈర్ష్య తెప్పిస్తున్నాయా అంటూ సెటైర్లు వేస్తున్నారు. సైరాకు సంబంధించి రజినీ కనీసం ఓ చిన్న ట్వీట్ కూడా వేయలేదు. పదేళ్ల క్రితం రజినీ అనారోగ్యంతో సింగపూర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు చిరంజీవి అక్కడికి వెళ్లి పరామర్శించారు.

 

 

రజినీకాంత్ అంటే చిరంజీవి అభిమానం చూపిస్తారు. ఆమధ్య సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా నా ఫ్రెండ్ రజినీ అని సంబోధించారు. కానీ రజినీ మాత్రం చిరంజీవి గురించి బాహాటంగా చెప్పింది లేదు. చిరంజీవి అభిమానులం అన్న తెలుగు వారిలో చాలామంది స్వాగతం చెప్పలేదు. నేను చిరంజీవి గారి అభిమానిని అని చెప్పుకునే బన్నీ కూడా విసెష్ చెప్పలేదు. ఈ చిన్న కారణాలే భూతద్దంలో చూపేందుకు కారణమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: