ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మొన్నటి వరకు విరామం లేకుండా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. అయితే ఇటీవల మహమ్మారి కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ వాయిదా పడడంతో ప్రస్తుతం తన కుటుంబం తో కలిసి ఇంట్లోనే హాయిగా సేద తీరుతున్నారు మెగాస్టార్. 

 

ఇక నిన్న తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా అఫీషియల్ గా సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ ఓపెన్ చేసిన మెగాస్టార్, ఇకపై ప్రజలు అలానే ఫ్యాన్స్ తో మరింతగా మమేకం అవడంతో పాటు తన వ్యక్తిగత అభిప్రాయాలను వారితో పంచుకోవడానికి ఈ మాధ్యమాల ద్వారా తనకు వీలుంటుందని అన్నారు. నిన్న ఉగాది పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న రౌద్రం రణం రుధిరం సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అవడంతో దానిపై స్పందించిన మెగాస్టార్, తనకు ఆ మోషన్ పోస్టర్ ఎంతో గూస్ బంప్స్ తెప్పించిందని, అలానే హీరోలుగా నటిస్తున్న చరణ్, ఎన్టీఆర్ తప్పకుండా సినిమాలో పెర్ఫార్మన్స్ ని అదరగొట్టి ఉంటారని, సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ దర్శకుడు రాజమౌళి సహా సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపారు. 

 

ఇకపోతే మరోవైపు చిరు సోషల్ మీడియా ఎంట్రీ పై స్పందించిన సూపర్ స్టార్ మహేష్, సర్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ సర్ అంటూ ట్వీట్ చేసారు. మీరు మా ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై చేసిన వ్యాఖ్యలు మాకు ఎంతో విలువైనవి, తొలిసారిగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మీకు నా అభినందనలు సర్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. ఇక మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీ తో అటు మెగాఫ్యాన్స్ తో పాటు ఇటు పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకుల్లో సైతం ఎంతో ఆనందం వెల్లివిరుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: