మహానటి టాలీవుడ్ చరిత్ర లో నిలిచిపోయే సినిమా ల్లో ఒకటి. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ నటించడం కంటే జీవించింది అనే చాలా మంది అభిమానులు అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా టాలీవుడ్ స్క్రీన్ మీద నిలిచిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ తన కెరీర్లో వెనకబడింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. 

 

కీర్తి సురేష్ కి మహానటి ద్వారా నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా కీర్తి సురేష్ ప్రాణం పెట్టి నటించిందని చెప్పవచ్చు. ఆ విధంగా ఆమె తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ వరుసగా అవకాశాలు వచ్చినా సరే ఆమె చేయడానికి ఎక్కువగా ఇష్టపడలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఆమె తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీర్తి సురేష్ ని తన సినిమాలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేసిన ఆమె అంగీకరించలేదు అని వార్తలు వచ్చాయి.

 

 ట్రిపుల్ ఆర్ సినిమాలో కీర్తి సురేష్ ని తీసుకునేందుకు రాజమౌళి కూడా ప్రయత్నాలు చేసినా ఆమె కొన్ని కారణాలతో ఆ సినిమాను అంగీకరించలేదట. అటు తమిళంలో కూడా మహానటి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయినా సరే అక్కడ కూడా కీర్తి సురేష్ తన ఇమేజ్ ని వాడుకోలేక పోయిందని, అందుకే ఇప్పుడు ఆమెకు అవకాశాలు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కీర్తి సురేష్ అందరి హీరోయిన్లు మాదిరిగా స్కిన్ షో చేయదు. దీంతో నిర్మాతలు దర్శకులు ఆమె ను పక్కన పెట్టారు అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: