టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అతనికి అమాంతంగా క్రేజ్  పెరిగిపోయింది. అటు బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ సినిమాల మీద ఆసక్తి చూపించారు. హీరోలు హీరోయిన్ లు అతని సినిమా విడుదల అవుతుంది అంటే ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు. ఇక యూత్ లో కూడా అతనికి మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ కాస్త అతి చేస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి.

 

అయితే  తనకు వచ్చిన క్రేజ్ ని విజయ్ దేవరకొండ సరిగా వాడుకోలేక పోయాడు అనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అతను సినిమా చేసే సమయంలో కూడా కాస్త యాటిట్యూడ్ చూపించటం ఇప్పుడు నిర్మాతలకు దర్శకులకు చికాకుగా మారింది. తనకు నచ్చిన విధంగా ఉండాలి. అదే విధంగా సినిమాలో బోల్డ్ సీన్ లు కూడా ఉండాలి అనడం, అలా అయితేనే యూత్ ని ఆకట్టుకుంటుంది అనడంతో ఇప్పుడు నిర్మాతలు అతని మీద చిరాకు పడుతున్నారు. దర్శకుడు సినిమా చేసే ముందు ఒక ప్లాన్ తో  ఉంటాడు. అలా కాకుండా ఏ అనుభవం లేని హీరో ఆ కథలో వేలు పెడితే అది చర్యగా మారుతోంది.

 

 ఇప్పుడు అతను చేయబోయే నాలుగు సినిమాలు కూడా మార్చాలని లవ్ స్టోరీస్ ఉండే విధంగా చూడాలని చెప్పడంతో ఇప్పుడు నిర్మాతలు దర్శకులు అతని మీద మండి పడుతున్నారు. ఈ ఆటిట్యూడ్ సినిమాల్లో పనికిరాదని ఎక్కువ కాలం ఇలా ఉంటే సినిమాలు చేయలేవని అతని మొహం మీద చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: