తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘బద్రి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన నటి రేణు దేశాయ్ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. జాను చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ - రేణు దేశాయ్ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.  వీరి కాపురం కొంత కాలం సజావుగా సాగింది.. ఇద్దరు పిల్లలు పుట్టారు.  కొన్ని కారణాల వల్ల విరిద్దరి మద్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పూనే లో తన ఇద్దరు పిల్లలతో ఉంటుంది. ఇక పవన్ కళ్యాన్ మూడో పెళ్లి చేసుకున్నప్పటికీ.. మాజీ భార్య రేణు దేశాయ్.. తన పిల్లలను యోగ క్షేమాలు తెలుసుకుంటారు.. వారి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు.. స్నేహసంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే సోషల్ మాద్యమాల్లో పవన్ కళ్యాన్ పై ఎలాంటి కామెంట్స్ వచ్చినా రేణు దేశాయ్ వెంటనే స్పందిస్తూ.. దానిపై కౌంటర్ వేస్తుంది.  

 

భార్యభర్తలుగా విడిపోయారే తప్ప వీరి మద్య అనుబంధాలు సమసిపోలేదనిపిస్తుంది.  తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రం బాలీవుడ్ ‘పింక్’ రిమేక్.  ఈ చిత్రంలో పవన్ తో పాటు ఓ కీలక పాత్రలో రేణు దేశాయ్ నటిస్తుందని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై స్పందిస్తూ..  'ఇది పచ్చి అబద్ధం... ఎవరో రూమర్లు స్టార్ట్‌ చేస్తారు.. అసలు రూమర్లు స్టార్ట్‌ చేసే ఇంత సమయం వారికి ఎలా ఉంటుంది.

 

ఇటువంటి వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది' అని  అన్నారు. దయచేసి ఇలాంటి రూమర్లకు చెక్ పెట్టండి.. ప్రస్తుతం కరోనా విజృంభనను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయండి అన్నారు. ఇంట్లో పెద్ద వారిని బాగా చూసుకోవాలని రేణూ దేశాయ్ సూచించింది. తన కూతురు ఆధ్యా స్కేటింగ్‌, పెయింటింగ్‌, డ్రాయింగ్‌, శాండ్‌విచ్‌ కుకింగ్‌ బాగా చేస్తుందని ఆమె తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: