'అయ్యప్పనుమ్ కోసియుమ్'...ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇది మలయాళంలో రీసెంటుగా విడుదలై ఘన విజయం సాధించిన ఒక సినిమా. ఈ సినిమాలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు చూస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ లో సూర్య కార్తీలు చేస్తున్నట్లు కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మన టాలీవుడ్ విషయానికి వస్తే ఈ సినిమా రీమేక్ రైట్స్ హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇందులో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

మొన్నటి దాకా విక్టరీ వెంకటేష్ - రవితేజలతో రీమేక్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిన్న బాలయ్య - ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా బాలయ్య - మంజు విష్ణు నటిస్తున్నట్లు మరో వార్త పుట్టుకొచ్చింది. ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని అనుకుంటున్నట్టు ఈ  మధ్య వార్తలు వచ్చాయి. ఇందులో ఇంకో హీరో పాత్రకు యువ హీరో అవసరం. ఆ పాత్ర కోసం మంచు విష్ణుని అనుకుంటున్నట్టు సమాచారం. అయ్యప్పన్ క్యారెక్టర్ కు బాలయ్యను, కోషియమ్ క్యారెక్టర్ కు విష్ణును తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 'అయ్యప్పనుమ్ కోసియుమ్' కథ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగో వల్ల, వాళ్ళ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఉంటుందట. పృథ్వీరాజ్ బిజూ మీనన్ లు ఈ పాత్రలను చాలా చక్కగా పోషించి చిత్ర విజయానికి కారణమయ్యారు. మరి మన టాలీవుడ్ లో ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో. ఈ చిత్రం ఎవరితో తీస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: