ఒక్కోసారి అత్యుత్సాహంతో చేసిన పనుల వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి పొరపాట్లు సామాన్యులు చేస్తే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ సెలెబ్రిటీలు చేస్తే మాత్రం వారిని ఒక ఆట ఆడుకుంటారు. అటువంటి పొరపాటే ఒక తెలుగు హీరోయిన్ చేసింది. కరోనా వైరస్ వల్ల ఎక్కడికీ వెళ్ళకండి అని ప్రభుత్వం మొరపెట్టుకుంటుంటే, ఈ అమ్మడు మాత్రం భర్తతో విదేశాల్లో తిరుగుతోంది. ఆ నటి ఎవరో కాదు. బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్.    

 

 

ఈమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా, అడవి కాచిన వెన్నెల, దోచెయ్, త్రిపుర, కృష్ణార్జున యుద్ధం, వెంకీ మామ లాంటి చాలా సినిమాల్లో నటించింది పూజా. విపరీతమైన అందాలు ఆరబోసినా, ఆమెకు కావాల్సిన స్టార్ ఇమేజ్ ను మాత్రం సంపాదించలేకపోయింది. ఆమె ఈమధ్యనే తన భర్త జాన్ కక్కర్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోడానికి మాల్దీవ్స్ వెళ్లింది.

 

 

ఓ వైపు సమ్మర్ విహారయాత్ర.. మరోవైపు బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఇంకేం కావాలి అని అనుకున్నారేమో కానీ, ఈ జంట మాత్రం ఎవ్వరికి చెప్పకుండా మాల్దీవ్స్ కి చెక్కేశారు. ఇంతలో మన దేశంలో కరోనా విజృంభించడం వల్ల లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలందరూ ఎవరి బాధల్లో వాళ్ళు ఉండగా, మాల్దీవ్స్ లో దిగిన పార్టీ ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది పూజా. ఆ ఫోటోల్లో బీచ్లో భర్త పక్కనే బికినీ వేసుకుని నిలబడి ఉంది పూజా. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు పూజను ఆడుకుంటున్నారు. దేశమంతా కరోనా వచ్చి చస్తుంటే, ప్రభుత్వాలు పార్టీలను బ్యాన్ చేసి, సోషల్ డిస్టెన్సిన్గ్ అని చెప్తుంటే, ఇప్పుడు పక్క దేశంలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా? ఇండియాకు వస్తే మీ కాళ్లు విరగ్గొడతాం అంటూ విరుచుకుపడుతున్నారు. సరదాగా పెట్టిన ఫోటోలకు వచ్చిన రియాక్షన్ చూసి పూజ రామచంద్రన్ బిత్తరపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: