ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై అన్ని దేశాలు కూడా గట్టిగా యుద్ధాన్ని ప్రకటించాయి. ముందుగా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించిన పలు దేశాలు, ఎవ్వరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, అలానే ఎవరికి వారు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే త్వరితగతిన ఈ వ్యాధిని అరికట్టగలం అని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనివలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది.  ఇక కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది.

 

కరోనా దెబ్బకు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఒక హీరో మాత్రం ప్రభుత్వ నిబంధలను పాటించకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అతనెవరో కాదు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్. ఆడు జీవితం అనే చిత్రం కోసం ఇలాంటి భయంకర పరిస్థితుల్లో కూడా చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడట. ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారని సమాచారం. ఈ మధ్యే విడుదలైన 'అయ్యప్పనుమ్ కోసియుమ్' సినిమా విజయం సాధించడంతో ఊపు మీదున్న పృథ్వీరాజ్ కరోనాని లెక్క చేయకుండా షూటింగ్ చేస్తూ విమర్శలపాలయ్యాడు. ఇదిలాఉండగా ఇప్పటి దాకా దేశంలో కరోనా బారినపడ్డ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 660 దాటిపోయాయి. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 16కి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: