అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా దూసుకు వచ్చింది లావణ్య త్రిపాఠి. నటనపరంగా మంచి మార్కులే పడినప్పటికి స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేపోయింది. ఇక లావణ్య త్రిపాఠి కెరీర్ లో చెప్పుకో దగ్గ సినిమాలంటే మారుతి డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భలె భలే మగాడివోయ్ సినిమా ఒక్కటే అని చెప్పాలి. మంచు విష్ణు తో ఒక సినిమా సూపర్ హిట్ అయినప్పటికి అది లావణ్య త్రిపాఠి కి పెద్దగా ఉపయోగపడింది లేదు. ఇక మెగా హీరోతో సినిమా చేసినప్పటికి ఆ సినిమా ఫ్లాపవడం తో లావణ్య త్రిపాఠి కెరిర్ అయోమయంలో పడింది. 

 

కాని ఉన్న పలంగా లావణ్య త్రిపాఠి కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే బంపర్ ఆఫర్ తగిలిందని అన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో లావణ్య త్రిపాఠి ని సెలెక్ట్ చేసుకున్నారట. రీసెంట్ గా లావణ్య కుర్ర హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన 'అర్జున్ సురవరం' సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ కాస్త ఫాం లోకి వచ్చింది. ఈ హిట్ తోనే తాజాగా తమిళంలో అధర్వ సరసన నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ సరసన 'ఏ1 ఎక్స్ ప్రెస్' లోను నటిస్తోంది. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కబోయో ఈ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్ గా నటించబోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్ళీ రేస్ లోకి వచ్చింది.

 

అయితే ఇప్పుడు లావణ్య కి ఏదో షాక్ పడిందని సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మితమవనున్న సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా లావణ్యని ఫైనల్ చేసినట్టు టాక్. వాస్తవంగా ఈ సినిమాలో ముందు శృతి హాసన్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారని అనుకున్నారు. 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ ని రిపీట్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకున్నారట. కానీ తాజాగా లావణ్య పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ తో పాటు లావణ్య కూడా నటిస్తుందని సెకెండ్ హీరోయిన్ అని అంటున్నారు. కాని ఇది లావణ్య కి షాకింగ్ న్యూస్ అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: