పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రెండేళ్ళ విరామం తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. అయితే  ఈ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉండగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ని నిలుపు చేశారు. తిరిగి త్వరలోనే బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేస్తారట. ఇక పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టారట.

 

సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సూర్య మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటు కరోనా ఎఫెక్ట్ తో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ చేయాల్సిన కొత్త ప్రాజెక్ట్ కూడా పెండింగ్ లో పడ్డట్టే. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ రికార్డ్ ని ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరొక సినిమా కమిటయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రం లేదా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో గాని ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట.

 

ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందని తెలుస్తుంది. ఇక పవర్ స్టార్ కూడా ఈ సినిమా డబ్బింగ్ పనులను తన ఇంటి నుండి పూర్తిచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కరోనా బారినుండి తప్పించుకోవాలంటే ఎవరి ఇళ్లలో వాళ్లు జాగ్రత్తగా ఉండి పనులు పూర్తిచేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా సందేశాన్ని అందిస్తున్నాడని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకరకంగా చాలా మంచి పని అయినప్పటికి కొంతమంది మాత్రం వకీల్ సాబ్ ఇలా చేయడం కరెక్టేనా అంటూ దిల్ రాజుని అడుగుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: