కోలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కు టాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే కొందరు తమిళంలో సినిమాలు చేస్తున్నా ఇక్కడ అవకాశాలు రావు. అలాంటి వారిలో నివేదా పేతురాజ్ ఒకరు. తమిళంలో మంచి ఐడెంటిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో ఈమధ్యనే వరుస ఛాన్సులు అందుకుంటుంది. మెంటల్ మదిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత బ్రోచేవారెవరురా సినిమా చేసింది. రెండు సినిమాలు పర్వాలేదు అన్నట్టు ఆడాయి. బ్రోచే కమర్షియల్ గా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఇక సాయి తేజ్ చిత్రలహరిలో అమ్మడు సెకండ్ హీరోయిన్ గా చేసింది. 

 

ఆ పాత్రలో కూడా తన అభినయంతో మెప్పించింది నివేదా. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో నివేదా ఛాన్స్ కొట్టేసింది. అయితే సినిమాలో మాత్రం ఆమెకు మామూలు పాత్ర మాత్రమే ఇచ్చారు. ఏమాత్రం గుర్తింపులేని పాత్ర చేసిన నివేదా లేటెస్ట్ గా మరోసారి మెగా మేనళ్లుడు సాయి తేజ్ సినిమాలు ఛాన్స్ కొట్టేసింది. దేవా కట్ట డైరక్షన్ సాయి తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో నివేదా పేతురాజ్ సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాతో అమ్మడు అదరగొట్టేలా ఉంది. 

 

ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న నివేదా తన మేకప్ లెస్ పిక్స్ తో ఆడియెన్స్ ను సర్ ప్రయిజ్ చేస్తుంది. మేకప్ లేకపోయినా అమ్మడు చాలా అందంగా ఉంది. తెలుగులో క్రేజ్ కోసం ఎదురుచూస్తున్న నివేదాకు సాయి తేజ్ లేటెస్ట్ సినిమాతో మంచి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. కోలీవుడ్ లో కెరియర్ ఎలా ఉన్నా తెలుగులో సక్సెస్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. తమిళ సినిమాలతో పోల్చుకుంటే ఇక్కడ హీరోయిన్స్ కు ఇచ్చే పారితోషికం ఎక్కువగా ఉంటుంది. అందుకే కోలీవుడ్ భామలు ఇక్కడ ఛాన్సుల కోసం ట్రై చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: