దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో దాదాపు దేశం స్థంభించిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రంగాల వారు అంతా ఇళ్ల పరిమితమవుతున్నారు. ఇక సినీ పెద్దలు కూడా లాక్‌ డౌన్‌లో భాగమయ్యారు. కొద్ది రోజులుగా సినిమా షూటింగ్ లకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ చేయటం సరికాదని అన్ని ఇండస్ట్రీలో షూటింగ్ లు వాయిదా వేశారు. రిలీజ్‌ లు కూడా ఆగిపోవటంతో అంతా ఖాళీగా ఉన్నారు.

 

అయితే ఇలాంటి ప్రమాధకర పరిస్థితుల్లోనూ ఓ హీరో షూటింగ్ చేస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్‌ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమ ఆడు జీవితం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్‌ లో జరుగుతోంది. అక్కడి పరిస్థితి బాలేదని షూటింగ్ ఆపేయాలని అధికారులు సూచించినా పృథ్వీ రాజ్‌ మాత్రం షూటింగ్ కొనసాగిస్తున్నాడు. అక్కడి అధికారులకు రికమండేషన్లు చేయించుకొని మరి షూటింగ్ కొనసాగిస్తున్నాడు.

 

ఈ చిత్రయూనిట్ 57 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఇది ప్రమాదకరమని తెలసినా. తప్పని సరి పరిస్థితుల్లో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నట్టుగా చెపుతున్నారట. ఒకసారి షూటింగ్ ఆపి వెనక్కి వచ్చేస్తే తిరిగి అక్కడికి వెళ్లి షూటింగ్ చేయటం నిర్మాతకు భారం అవుతుందన్న ఉద్దేశంతోనే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారట. హీరో పృథ్వీ రాజ్‌ కూడా నిర్మాత క్షేమం కోసం రిస్క్ అయినా షూటింగ్ చేద్దామని చెప్పాడట. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి ఆయన అభిమానుల్లో ఆంధోళన వ్యక్తమవుతుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Life does sometimes meet cinema. #Aadujeevitham #WadiRum #Jordan

A post shared by prithviraj Sukumaran (@therealprithvi) on

మరింత సమాచారం తెలుసుకోండి: