మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వడం మెగా అభిమానులకు ఒక పండుగగా మారడంతో చిరంజీవి సోషల్ మీడియా అకౌంట్స్ కు కనీవినీ ఎరుగని స్పందన కొనసాగుతోంది. చిరంజీవి ఒకేసారి ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను ప్రారంభించిన 24 గంటలలోనే చిరంజీవి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య లక్ష దాటిపోవడంతో పాటు మెగా స్టార్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షలకు దాటిపోవడంతో పాటు పవన్ కళ్యాణ్ కరోనా సమస్య నివారణ కోసం ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీ స్థాయిలో విరాళాలు ఇవ్వడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మెగా అభిమానుల హడావిడి కనిపిస్తోంది. 

చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా నాగార్జున మహేష్ బాబు మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు చిరంజీవి ట్వీట్ ని కోట్ చేస్తూ స్వాగతం పలికారు. అంతేకాదు మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ నిహారికలు చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీకి స్వాగతం పలికారు. 


ఇంత హడావిడి జరుగుతున్నా ప్రస్తుతం షూటింగ్ లు లేక ఇంట్లో ఖాళీగా కూర్చున్న అల్లు అర్జున్ పట్టించుకోక పోవడం పై మెగా అభిమానులు మండిపోతున్నారు. గతంలో ‘సైరా’ నరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడ బన్నీ స్పందించలేదు. అయితే ఆతరువాత తాను షూటింగ్ హడావిడి వల్ల ‘సైరా’ ట్రైలర్ ను వెంటనే చూడలేకపోయాను అంటూ సద్ది చెప్పుకున్నాడు. 


ఇప్పుడు షూటింగ్ లు కూడ లేని పరిస్థితులలో ఖాళీగా ఉన్న బన్నీ చిరంజీవికి కనీసం స్వాగతం చెపుతూ ఒక ట్విట్ చేయడానికి కూడ ఖాళీ లేదా అంటూ మెగా అభిమానులు బన్నీని ప్రశ్నిస్తున్నారు. దీనితో జరుగుతున్న విషయాలు బన్నీ అభిమానుల దృష్టి వరకు రావడంతో తమ హీరో తన కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానిగానే ఉండిపోతాను అని అల్లు అర్జున్ ఓపెన్ గా చెప్పిన విషయం అప్పుడే మర్చి పోయారా అంటూ బన్నీ అభిమానులు మెగా అభిమానులను ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న ఈ రగడ బన్నీ దృష్టి వరకు వెళితే ఏ క్షణంలో అయినా అల్లు అర్జున్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ పై స్వాగతం చెపుతూ ఈ రగడకు తెరదించే ఆస్కారం కనిపిస్తోంది..     

మరింత సమాచారం తెలుసుకోండి: