సీనియర్ హీరోలు డిఫరెంట్ సినిమాలతో సత్తా చాటుతుంటే నందమూరి బాలకృష్ణ మాత్రం మూస కాన్సెప్ట్ లతో బోర్ కొట్టిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్ కావటంతో బాలయ్య అభిమానులు నిరాశచెందారు. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్‌ సినిమా కు డిజాస్టర్ టాక్‌ రావటంతో అభిమానులు మరింతగా నిరాశచెందారు.

 

దీంతో నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్‌ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాతో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే లైన్‌ లో పెట్టాడు. మలయాళంలో సూపర్‌ హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కోసియుమ్‌ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు బాలయ్య.

 

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బిజీమీనన్‌లు హీరోలుగా నటించిన ఈ సినిమాను తెలుగులో బాలయ్య, ఎన్టీఆర్‌లు హీరోలుగా రీమేక్ చేస్తున్నారన్న ప్రచారం జరుగింది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కు బదులుగా ఆ పాత్రలో మంచు విష్ణు నటించనున్నాడట. గతంలో పలువురు హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు విష్ణు. నాగార్జునతో పాటు తండ్రి మోహన్ బాబుతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేశాడు.
IHG

 

గతంలో బాలయ్య మంచు హీరో మనోజ్‌ తో కలిసి ఊ కొడతార ఉలిక్కి పడతారా సినిమాలో నటించాడు. అందుకే మరోసారి మంచు ఫ్యామిలీతో కలిసి నటించేందుకు బాలయ్య ఒకే చెప్తాడని భావిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: