సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ రాబోతుంది. గీతా గోవిందం తర్వాత పరశురామ్ చేయబోయే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం వార్తల్లో ఇద్దరు హీరోయిన్ల పేరు వినపడుతుంది. అందులో ఒకరు బాలీవుడ్ ముద్దుగుమ్మ కియరా అద్వానీ కాగా మరొకరు మహానటి కీర్తి సురేష్. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వానీ ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. 

 

ఇక ఆ మూవీ ఫ్లాప్ అవడంతో ఇక్కడ ఆఫర్లు వస్తన్నా సరే చేయనని చెబుతుందట. అయితే మహేష్ లాంటి హీరో ఛాన్స్ ఇస్తే అమ్మడు కాందంటుందా అంటే మహేష్, చరణ్ ఆఫర్లు మాత్రం ఓకే చెప్పేలా ఉంది. ఇక కియరా కాకుంటే మాత్రం మహానటి కీర్తి సురేష్ కు మహేష్ తో నటించే ఛాన్స్ దక్కనుందని తెలుస్తుంది. మహానటి ముందు వరకు కీర్తి సురేష్ రేంజ్ వేరు కానీ ఆఫ్టర్ మహానటి కీర్తి సురేష్ నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. మహేష్ తో ఇదివరకు నటించే అవకాశం వచ్చినా ఆ ఛాన్స్ మిస్సైన కీర్తి సురేష్ ఈసారి మాత్రం ఛాన్స్ వస్తే చేసేందుకు రెడీ అంటుంది. 

 

మహానటి తర్వాత తమిళ సినిమాలు ఎక్కువ చేసిన కీర్తి సురేష్ తెలుగులో మిస్ ఇండియా సినిమా చేస్తుంది. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. మహేష్ పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమాలో కియరా అద్వానీ, కీర్తి సురేష్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హీరోయిన్ గా చేస్తారని తెలుస్తుంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: