ప్రస్తుతం కరోనా భయంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితిమైంది. అడుగు బయటపెట్టడానికి ప్రజలు వణికిపోతున్నారు. సాదారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరి పరిస్థితి ఇదే. అయితే ఈ పరిస్థితుల్లోనూ ఓ అందాల భామ తన పిల్లలను తీసుకొని బయటకు వెళ్లింది. దీంతో నెటిజెన్లు బాధ్యత ఉండక్కర్లా..? అంటూ ఆమె మీద ఫైర్‌ అవుతున్నారు.

 

యాంట్ మేన్‌, లాస్ట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన హాలీవుడ్ బ్యూటీ ఎవంగెలైన్‌ లిల్లీ. ఈ భామ కరోనా భయంతో వణికిపోతున్న సమయంలో తన పిల్లలను ఔటింగ్ కు తీసుకుపోయింది. లిల్లీ తన ఇన్‌ స్టాగ్రామ్ పేజ్‌ లో ఇప్పుడేనా పిల్లలను జిమ్నాస్టిక్స్‌ క్యాంప్‌లో వదిలేసి వచ్చాను. వాళ్ల లోపలికి వెళ్లే ముందు చేతులు శుభ్రంగా కడుక్కున్నారు. వాళ్లు సరదాగా ఆడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు` అంటూ పోస్ట్ చేసింది.

 

ఈ పోస్ట్ పై మరో నటి గ్రేస్‌ స్పందించింది. `భయపడాల్సిన అవసరం లేకపోయినా, సోషల్ డిస్టాన్సింగ్ మెయిన్‌టైన్ చేయటం మన అందరి బాధ్యత. నువ్వు తీసుకున్న ఈ చిన్న నిర్ణయం తరువాత ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందో ఆలోచించు` అంటూ కామెంట్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#morningtea ☕️ Just dropped my kids off at gymnastics camp. They all washed their hands before going in. They are playing and laughing. #businessasusual

A post shared by Evangeline Lilly (@evangelinelillyofficial) on

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: