మహేష్ పరుశు రామ్ ల కాంబినేషన్ లో ఇప్పటికే ఫిక్స్ అయిన మూవీ పూజా కార్యక్రమాలు వాస్తవానికి ఉగాది రోజున జరగాలి. అయితే కరోనా ఎఫెక్ట్ తో అన్ని సినిమా కార్యక్రమాలు నిలిచిపోయిన పరిస్థితులలో కనీసం ఈ మూవీ పూజా కార్యక్రమాలను కూడ ఆరోజున నిర్వహించలేకపోయారు. 


ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ కథ ఫైనల్ కావడంతో ఈ మూవీలోని కీలక నటీనటుల ఎంపిక కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు కీర్తి సురేశ్ ను ఎంపిక చేయమని స్వయంగా మహేష్ పరుశు రామ్ కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈమూవీ కథ రీత్యా హీరోయిన్ పాత్రకు బాగా ప్రాధాన్యత ఉండటంతో ఆ పాత్ర అన్ని విధాల కీర్తి సురేశ్ కు నప్పుతుందని మహేష్ పరుశు రామ్ లు భావిస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఈ మూవీలో కీర్తిని నటింపచేసే విషయంలో కీర్తికి కథ వినిపించడానికి పరుశు రామ్ ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం ఎక్కడి వారు అక్కడే చిక్కడిపోయి కనీసం డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడ లేని పరిస్థితులలో కీర్తికి ఈ మూవీ కథను పరుశు రామ్ ఫోన్ లో వివరించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. 


అయితే ప్రస్తుతం కీర్తి నటిస్తున్న చాల సినిమాల షూటింగ్ లు ఆగిపోయిన పరిస్థితులలో తిరిగి షూటింగ్స్ ప్రారంభం అయ్యాక కీర్తి ఎంతవరకు తన డేట్స్ ను సద్దుబాటు చేయగలుగుతుంది అన్న సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘మహానటి’ మూవీ విడుదల అయినప్పటి నుండి మహేష్ కీర్తి తో నటించాలని అభిప్రాయ పడుతున్నట్లు టాక్. మరి ఇప్పుడు ఆ కోరికను పరుశు రామ్ తీర్చగలడా లేదా అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీ షూటింగ్ జూన్ నుండి ప్రారంభించాలని పరుశు రామ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నా ఎంతవరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సహకరిస్తయో లేదో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: