సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా విషయమై దర్శకుడు పరశురామ్ తో కథ పై మరింత గట్టిగా చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. వాస్తవానికి ఇటీవల రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, అక్కడక్కడా ఈ సినిమాపై కొంత మేర ఆశించిన రేంజ్ లో అప్లాజ్ రాలేదు. అందువలన తదుపరి పరశురామ్ తో చేయబోయే సినిమాలో అటువంటివి తలెత్తకుండా ఇప్పటినుండే మరింతగా జాగ్రత్త వహిస్తున్నారట మహేష్. 

 

అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో మహేష్ ఒక కొత్త అవతారంలో దర్శనం ఇవ్వనున్నారట. ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో ఇంటివద్దనే ఉంటూ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్న సూపర్ స్టార్, నిన్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇక ఈ కరోనా ను కట్టడి చేయడానికి ఇటీవల ఆరు సూత్రాలను తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించిన మహేష్, నేడు తన ముద్దుల తనయ సితార పాప, కరోనా కట్టడికి పాటించవలసిన పంచ సూత్రాల తాలూకు వీడియో ని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. 

 

ముందుగా ఎప్పటికప్పుడు వీలైనన్ని ఎక్కువసార్లు మన చేతులను కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలని, ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఎక్కువైనట్లైతే వెంటనే సమీప డాక్టర్ ని సంప్రదించాలని, అవకాశం ఉన్నంతవరకు ఇళ్లకే పరిమితం అయి సోషల్ డిస్టెన్స్ ని పాటించాలని, దగ్గు, తుమ్ము వంటివి వచ్చినపుడు మన ముఖానికి చేతిని మోచేతివరకు గట్టిగా అడ్డుపెట్టుకోవాలని, అలానే మన చేతులతో ముక్కు, పెదాలు, కళ్ళను పదే పదే రుద్దడం వంటివి చేయవద్దని తన వీడియో బైట్ ద్వారా సితార సూచనలు చేసింది. ప్రస్తుతం సితార పంచ సూత్రాల వీడియో పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: