తెలుగు చలన చిత్ర రంగంలోఓటమి ఎరుగని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. హీరో పాత్రల్ని మరింత ఫెరోషియస్గా తెరపైకి తీసుకురావడంలో రాజమౌళిని మించిన దర్శకులు లేరంటే ఎంత మాత్రం అతిశయోక్తికాదు. విక్రమార్కుడు, మగధీర, బాహుబలి చిత్రాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఓ హీరో లేకుండా కేవలం ఈగ (గ్రాఫిక్)తో విలన్ ని ముప్పతిప్పలు పెట్టే కాన్సెప్ట్ తో ఓ ట్రెండ్ సృష్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి రాజమౌళి పాన్ ఇండియా స్థాయి విజయం తరువాత చేస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ మూవీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లే నటిస్తున్నారు.
అయితే సంవత్సరం నుంచి ఈ చిత్రం నుంచి ఫస్ట్లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూసిన సినీ ప్రేక్షకులకు ఉగాది రోజున `ఆర్ఆర్ఆర్` రౌద్రం రణం రుధిరం టైటిల్ లోగో మోషన్ పోస్టర్తో సర్ప్రైజ్ని అందించి చిత్రం ఏ రేంజ్లో రెడీ అవుతోందో హిట్ ఇచ్చేసింది. ఒక నిమిషం 15 సెకన్లు ఉన్న ఈ మోషన్ పోస్టర్ వీడియో పోస్ట్ చేసిన వెంటనే లక్ష వ్యూస్ సాధించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ యుట్యూబ్ ఛానల్ లో దీన్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో హీరోలు ఇద్దరూ పోరాటం కోసం పరిగెడుతున్న విధంగా చూపించాడు జక్కన్న.
నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు.. ఎన్టీఆర్ ఓ ట్విట్ చేశాడు. తొలుత రామ్ చరణ్ కు క్షమాపణలు చెబుతూ, నీకివ్వాల్సిన బహుమతిని జక్కన్నకు పంపించానని, కాస్తంత ఆలస్యంగానైనా అందుతుందని చెప్పారు. దీనిపై స్పందించిన రామ్ చరణ్, ఈరోజు తనకు ఆ బహుమతి అందుతుందా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ, "యస్ బ్రో... ఇప్పుడే జక్కన్నతో మాట్లాడాను. సాయంత్రం 4 గంటలకు తప్పకుండా అందుతుంది" అని అన్నారు. దీని కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Yes bro @AlwaysRamCharan 😀 . Just checked with Jakkana @ssrajamouli . He's saying 4pm for sure 🤷🏻♂️ https://t.co/3hk0PLedOw
— jr ntr (@tarak9999) March 27, 2020