టాలీవుడ్ లో బాహుబలి2 తర్వాత ఆ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక సినిమా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైలిట్ గా వచ్చింది. ఉగాది కానుకగా ఆర్ఆర్ఆర్ టైటిల్ రిలీజ్ చేశారు. ‘రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’. ఈ మూవీలో ఎన్టీఆర్, చరణ్లతో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్, సముద్ర ఖని ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
తాజాగా ఈ మూవీలో మరో సూపర్ స్టార్ నటించనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన సూపర్ స్టార్ ఎవరో కాదు.. మోహన్ లాల్. మలయాళ సూపర్ స్టార్. ఈ మలయాళ సూపర్స్టార్ను ఈ భారీ మూవీలో నటింప చేయాలనుకుని రాజమౌళికి ఆయనకు పాత్ర గురించి చెప్పాడట. ఆయన కూడా నటించడానికి ఆసక్తిని చూపుతున్నాడంటూ వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో నటిస్తున్నారు.
అయితే ఉగాది సందర్భంగా విడుదల చేసిన టైటిల్ కు అలాగే మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. అయినా కూడా ఈ సమయంలో కొత్తగా కొంత మంది షూటింగ్లో ఇంకా జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కరోనా ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత మళ్లీ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో మొత్తం పాన్ ఇండియా నటులు ఉండేలా చూసుకుంటున్నాడు అని అనిపిస్తుంది.