మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వసూళ్ళ పరంగా చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే మహేష్ బాబు కెరీర్ లో ఇది ఫ్లాప్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమా మీద మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా సినిమా ఫ్లాప్ అవ్వడంతో మహేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మహేష్ ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేదు అని టాలీవుడ్ వర్గాలు కూడా అంటున్నాయి. మహేష్ ఈ సినిమాలో భారీగా పెట్టుబడి పెట్టాడు. 

 

అయితే వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మహేష్ బాగా నష్టపోయాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయినా సరే అతనికి దర్శకుడు అనీల్ రావిపూడి మీద నమ్మకం ఉందనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం అనీల్ రావిపూడికి మరో అవకాశం ఇవ్వాలని మహేష్ బాబు భావించినట్టు వార్తలు వస్తున్నాయి. కథ రెడీ చేయమని మహేష్ అతనికి చెప్పాడట. అందుకు రెండు నెలల సమయం ఇవ్వగా రెండు నెలల్లో తాను కథ పూర్తి చేయలేను అని కనీసం అందుకు నాలుగు నెలలు కావాలని మహేష్ కి అనీల్ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. 

 

దీనితో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడట. ముందు వంశీ పైడపల్లి తో మహేష్ సినిమా చెయ్యాలి అనుకున్నాడు. ఆ కథ మహేష్ బాబుకి ఆశించిన స్థాయిలో నచ్చలేదని అందుకే ఇప్పుడు మహేష్ ఆలోచన మార్చుకుని మళ్ళీ అనీల్ తోనే సినిమా చెయ్యాలని ప్లాన్ చేసాడని అంటున్నారు. ఇప్పుడు అనీల్ అంగీకరించకపోవడం తోనే మహేష్ బాబు ఆలోచన మార్చుకుని గీత గోవిందం ఫేం పరుశురాం కి అవకాశం ఇచ్చాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత... షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: