కరోనా దెబ్బకు అడుగు తీసి బయట పెట్టాలంటే హడలి చస్తున్నారు. పేద, ధనిక, చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఒక వేళ తప్పని సరిగా బయటకి వెళ్ళవలసిన పరిస్తితి వస్తె మొహానికి మాస్క్, చేతిలో సానిటైజార్ తప్పక ఉండాల్సిందే. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట కరోనా కేసులు నమోదు అవుతునేవున్నాయి. తాజాగా తెలుగు సినీ హీరోయిన్ ఒకరు ముంబై వెళ్లి బెంగళూరు వచ్చారు. అయితే ఆమెకు కరోనా సోకినట్టు వార్తలు సినీ పరిశ్రమ లో హల్ చల్ చేస్తున్నాయి. 

 

ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా సులభం గా వ్యాపిస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు ఆమె నుంచి ఇంకా ఎంత మందికి సోకి ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా లో, టీవీ లో, ఇలా ప్రతి చోట కరోనా వైరస్ గురించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని గొంతు చించుకుని చెప్తుంటే ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నారు అని ఆ హీరోయిన్ ముంబై వెళ్లి రావడం గురించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. కరోనా వైరస్ ఆమెకు సోకింది అనే ప్రచారం ఇప్పుడు సినీ పరిశ్రమలో జనాలను ఆవేదనకు గురి చేస్తుంది. 

 

ఇప్పుడు ఆమె బెంగళూరు లో ఉన్నారా హైదరాబాద్ లో ఉన్నారా అనేది స్పష్టత రావడం లేదు. ఆమెతో పాటు ఉన్న వాళ్లకు కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. ఆమె విదేశాలకు వెళ్లి వచ్చారా లేదా అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి ఆమె కోలుకుంటున్నారు అంటున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ కూడా ఆపేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: