టాలీవుడ్ లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా లేకపోయి ఉంటే ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ చేస్తున్న హడావుడి గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టిస్తుంది. తెలుగులో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు ఇప్పుడు ఈ సినిమా ఒక క్రేజ్ అయిపోయింది. ఉగాది సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. 

 

టైటిల్ కూడా ఈ సినిమా పోస్టర్ లో రిలీజ్ చేసారు. రౌద్రం, రణం, రుధిరం అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు 80 శాతం పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో కరోనా దెబ్బ కొట్టింది. 

 

ఇది పక్కన పెడితే ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ నందమూరి ఫాన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ముందు నుంచి వివాదాలకు దూరంగా ఉండే రామ్ చరణ్సినిమా ద్వారా తాను ఎన్టీఆర్ కి ఎంత సన్నిహితుడినో చెప్పేసాడు. కరోనా హెచ్చరిక సందర్భంగా వీరు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇగో పక్కన పెట్టి అతను ఈ సినిమాకు ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: