టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'భరత్ అనే నేను', 'మహర్షి' మరియు తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ప్రస్తుతం నెక్స్ట్ సినిమా ఏం చేయాలి అన్న దాని విషయంలో అనేక కథలు వింటున్న నేపథ్యంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఇంటికి పరిమితం అయ్యారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు బావ అనే ట్యాగ్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. అయితే ఎక్కడా కూడా మహేష్బాబు ఇమేజ్ వాడుకోకుండా తనకంటూ సెపరేట్ గుర్తింపును దక్కించుకున్నాడు సుధీర్ బాబు.

 

రెగ్యులర్ మరియు కమర్షియల్ సినిమాలు కాకుండా తనకంటూ ఓ సెపరేట్ ట్రాక్ ఉండే విధంగా అన్ని రకాల కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ నటిస్తూ తనకంటూ సెపరేట్ ముద్రవేసుకున్నాడు. ఒకపక్క సౌత్ ఇండియాలో మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోలలో డిఫరెంట్ స్టోరీలతో సుధీర్ బాబు సినిమాలు చేస్తాడు అనే బ్రాండ్ ఉంది. ఈ క్రమంలో న్యాచురల్ స్టార్ నాని తో కలిసి  వి అనే సినిమాల్లో నటించడం జరిగింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఇటీవల సుధీర్ బాబు ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ...టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మాస్త్ర సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.

 

హిందీలో 'భాగీ' సినిమాలో విలన్ గా నటించడంతో అక్కడ మంచి గుర్తింపు వచ్చింది.అదే ఆ సినిమా కారణంగా 'బ్రహ్మాస్త్ర' మూవీలో కూడా అవకాశం వచ్చింది.అదే సమయంలో గోపిచంద్ బయోపిక్ మీద వర్క్ చేస్తున్నాం. దానికోసం బరువు కూడా తగ్గాను. అయితే సినిమా కోసం ఏకంగా 90 రోజులు కాల్ షీట్స్ అడగడంతో బయోపిక్ కి ఇబ్బంది అవుతుందని భావించి ఆ బాలీవుడ్ సినిమా అవకాశం నుండి డ్రాప్ అయిపోయా అని చెప్పాడు. దీంతో ఈ వార్త విని మహేష్ బాబుకి అయినా చెప్పి ఉండాల్సింది పాపం అంటూ సుధీర్ బాబు వ్యాఖ్యలకు అభిమానులు ప్రతి స్పందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: