తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చినా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. హీరోలు దర్శక నిర్మాతలు తమ వంతుగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది, దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలిపని చేసుకునే వారి పరిస్థితి మరీ దారుణం. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. 

 

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. నితిన్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మంచు మనోజ్, రాజశేఖర్, అల్లరి నరేష్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వి.వి.వినాయక్, అనిల్ రావిపూడి వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది.

 

మేము సైతం అంటూ టాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నేడు కరోనా బాధితుల సహాయార్థం వారి వైద్య సదుపాయం కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని అందజేశారు. ఒక్కో రాష్ట్రానికి పది లక్షల చొప్పున తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి అందజేశారు. ఇదే విధంగా బాధితుల సహాయార్థం నిర్మాత దిల్ రాజు - హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు కూడా ముందుకొచ్చి విరాళాలు అందించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: