మన టాలీవుడ్ లో నిర్మాతలు పర భాషలో సూపర్ హిట్టయిన ఒక సినిమా రీ మేక్ రైట్స్ ని పోటీపడి దక్కించుకుంటారు. అయితే ఆ సినిమా అప్పటికే అమోజాన్, నెట్ ఫ్లిక్స్ లో చూసేస్తారు. అయినా మన మేకర్స్ ఆ కథని మన నేటివిటీకి తగ్గట్టు కథ లో మార్పులు చేర్పులు చేసేస్తారు. అయితే ఆ తర్వాత వచ్చేదే అసలైన చిక్కు. అదే ఆ కథకి సరిపోయో హీరోని ఎంచుకోవడం. ఆ కథ కి నిర్మాతలు కొంతమందిని అనుకుంటారు. అనుకున్న వాళ్ళ డేట్స్ కుదరకనో లేక ఆసక్తిని చూపించకపోవడమో జరుగుతుంది. ఇక కొంతమంది హీరోలు ఓకే అనుకున్నా మేకర్స్ కి రెమ్యూనరేషన్ ఇష్యూ వస్తుంది. అయితే ఈ లోపే సోషల్ మీడియాలో ఈ రీమేక్ లో నటించే హీరో ఇథనే అని రోజుకొకరి గురించి ప్రచారం చేసేస్తారు. అదే ఇప్పుడు ఒక సినిమా విషయంలో జరుగుతుంది.

 

'అయ్యప్పనుమ్ కోసియుమ్' మలయాళ మూవీ రీమేక్ రైట్స్ హారిక హాసిని - సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ ని అందుకుంది. దాంతో  ఈ సినిమాని రీమేక్ చేయాలని మిగతా భాషల వాళ్ళు సన్నాహాల్లో ఉన్నారు. ఇక మన టాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి సంబందించి రోజుకొక వార్త పుట్టుకొచ్చింది. ఇందులో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముందు విక్టరీ వెంకటేష్ - రవితేజలతో రీమేక్ చేస్తున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది. తర్వాత బాలయ్య - ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారంటూ పుకారు పుట్టించారు. ఇప్పుడు తాజాగా బాలయ్య - మంచు  విష్ణు నటిస్తున్నట్లు మరో వార్త ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇంకో యువ హీరో తెర మీదకి వచ్చాడు.

 

అతనే దగ్గుబాటి రానా. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం రానాని సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోషియమ్ క్యారెక్టర్ కు రానాను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రానా కూడా ఈ సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నాడట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తుంది. ఇక మరో ప్రధాన పాత్ర 'అయ్యప్పనుమ్' కోసం ఒక స్టార్ హీరో తో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. మొత్తానికి ఒకే కథ లో ఇంతమంది హీరోల పేర్లు తీసుకు వచ్చి ఇంకా ఎవరు కన్‌ఫర్మ్ కాలేదన్న మాట చివరకి చెప్పడం మరీ విడ్డూరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: