టాలీవుడ్ లో చేసింది చాలా తక్కువ  సినిమాలే,  అయినా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో  సాయి పల్లవి ఒకటి. భానుమతి ఒక్కటే పీస్..ఐబ్రీడ్ పిల్లా.. అని  సాయి పల్లవి చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.  ఫిదా సినిమాతో  తెలుగు ప్రేక్షకులను బాగా అకట్టుకుంది .తెలంగాణా యాసలో అదరగొట్టింది.

 

అసలు సినిమా రిలీజ్ కి ముందు అందరు సాయి పల్లవిని చూసి పెదవి విరిచారు.  ముఖం మీద మెటిమలు ఉన్న అమ్మాయి హీరోయిన్ అవుతుందా? మేకప్ అవసరం లేదు.. నేచురల్ గా ఉంటాననే అమ్మాయి ఆగ్ర హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా? అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ అందుకు భిన్నంగా నటించి తను ఏంటో అన్నది నిరూపించుకుంది సాయి పల్లవి.ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చినా కూడా ఆచితూచి ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తోంది.

 

ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్  హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.  అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సాయి పల్లవి  క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సినిమాకు దాదాపు కోటికి పైగానే తీసుకుంటుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే గ్లామర్ షో విషయంలో మరోసారి ఓపెన్ అయిపోయింది ఈ భామ.

 

తనకు లిప్ లాక్ సీన్స్ అయినా.. హాట్ సన్నివేశాల్లో నటించడం అన్నా అస్సలు ఇష్టం ఉండదు అని తేల్చి చెప్పేసింది.  ఎంత స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా తను మాత్రం అలాంటి  ఎక్సపోసింగ్  సన్నివేశాలకు దూరంగా ఉంటానని తెగేసి చెప్పేసింది. రెమ్యూనిరేషన్ ఎంత ఇచ్చిన గాని అసలు గ్లామరస్ పాత్రలు చేయను అని చెప్పింది. అలా చెప్పిన మాటకు సైతం కట్టుబడి ఉంది సాయి పల్లవి.  అయితే సాయి పల్లవి నిర్ణయంతో దర్శక నిర్మాతలు మాత్రం కాస్త డైలమాలో పడుతున్నారు.తాను కెరీర్ లో ఇన్ని సినిమాలు చేశాను అని కాకుండా మంచి సినిమాలు చేశాను అని చెప్పుకోవాలనుకుంటున్నాను. అందుకే ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు ఓకే చెప్పడం లేదు అని దర్శక నిర్మాతలకి ఒక మీడియా ద్వారా ఈ మధ్య తెలియచేసింది.

 

చాలా సినిమాల్లో  అవకాశం  వచ్చినా గాని  కేవలం హాట్ సీన్స్ ఉన్నాయనే కారణంతోనే  చాలా సినిమాలు  వదిలేసుకుంది ఈ ఫిదా బ్యూటీ.ఎన్ని కోట్లిచ్చినా కూడా తాను ఎక్స్‌పోజింగ్ చేయనంటూ తెగేసి చెబుతుంది. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం సినిమాతో పాటు నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది సాయి పల్లవి. ఈ రెండు సినిమాలతో మళ్లీ తనేంటో చూపిస్తా అంటుంది ఈ ఫిదా పోరి.

మరింత సమాచారం తెలుసుకోండి: