అయ్యప్పనుమ్ కోసియుమ్' ఏ ముహూర్తాన ఈ సినిమా తీసి మేకర్స్ హిట్ కొట్టారో గాని...ఇప్పుడు ఈ సినిమా తెలుగు వాళ్ళనే కాదు మిగతా భాషల దర్శక నిర్మాతలతో పాటు హీరోలని కలవరపెడుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఎక్కువగా ఈ సినిమా పేరు వినిపిస్తుంది. మన నేటివిటికీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి గనక తెరకెక్కిస్తే బ్లాక్ బస్టర్ పక్కా అన్న ధీమాలో ఉన్నారట మనవాళ్ళు. ఈ మలయాళంలో రీసెంటుగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.  పృథ్వీరాజ్ బిజూ మీనన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రీమేక్ చేయాలని మిగతా ఇండస్ట్రీ మేకర్స్ కూడా బాగా పోటీపడుతున్నారు. 

 

మన టాలీవుడ్ లో ఈ మూవీ రీమేక్ రైట్స్ ని హారిక హాసిని - సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నారు. అది కూడా త్రివిక్రమ్ సలహా మేరకే అని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ప్రతీ రోజు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ రోజు వరకు ఈ సినిమాలో నటించే హీరోలు వీళ్ళే అంటూ రోజుకో హీరో పేరు ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు దర్శకుడు ఇతనే అన్న టాక్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. కాని అవన్ని కాదని ఇప్పుడు ఇంకో న్యూస్ బయటకి వచ్చింది. హారిక హాసిని నిర్మాతలకి త్రివిక్రమ్ కి ఉన్న బంధం గురించి అందరికి తెలిసిందే. రాధాకృష్ణ (చినబాబు) నాగవంశీలతో త్రివిక్రమ్ కి మంచి ట్యూనింగ్ ఉంది. త్రివిక్రమ్ గత కొంతకాలంగా అన్నీ సినిమాలు వాళ్ళ బ్యానర్ లోనే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా రీమేక్ పనులు ఇప్పుడు త్రివిక్రమ్ చూసుకుంటున్నారని అంటున్నారు. 

 

అంతేకాదు ఈ సినిమా బాధ్యతను తన భుజాల మీద వేసుకున్న త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ పనులను డైరెక్టర్ వెంకీ కుడుములకు అప్పగించాడని తాజాగా న్యూస్ ఫిల్మ్ నగర్ లో బాగా వినిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయో సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దాంతో నితిన్ కి బాగా దగ్గరైన భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములు అయితే ఈ స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేయగలడని త్రివిక్రమ్ ధీమాగా ఉన్నారట. ఇక స్క్రిప్టు కి హ్యూమర్ కూడా యాడ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయమని త్రివిక్రమ్ చెప్పారని తెలుస్తుంది. అయితే ఈ కల్ట్ స్టోరీ మన తెలుగు ప్రేక్షకులకి ఎంతవరకు ఎక్కుతుందో అన్న అనుమానాలు ఉన్నాయని మరో టాక్ కూడా వినిపించడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ మీద మేకర్స్ పెట్టుకున్న రోడ్డున పడే అవకాశం రాదు కదా అంటూ కొందరు చెప్పుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: