కరోనా ఎఫెక్ట్ తో ప్రధాని మోడీ దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యవస్థ మొత్తం ఆగిపోయినట్టుగా కనిపిస్తున్న కరోనా మహమ్మారిని పారద్రోలడం కోసం ఈ మాత్రం చేయక తప్పదని తెలుస్తుంది. ఇండియాలో కరోనా కనుక ప్రభలితే దాని పర్యావసానాలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ప్రజలను అడ్డుకట్ట వేస్తూ ఇంట్లో ఉండి మీ మీ ప్రాణాలు దక్కించుకోండని చెబుతున్నారు. సినిమా తారలంతా ఈ హోమ్ క్వారెంటైన్ టైంలో తమ నెక్స్ట్ సినిమా కోసం మెంటల్ గా సిద్ధమవుతున్నారు. కొందరు భామలు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  

 

అయితే తాజాగా మళయాళ భామ కళ్యాణి ప్రియదర్శన్ ఒక టర్కీ సినిమా చూసిందట. ఆ సినిమా చూసిన అమ్మడు బాగా ఏడ్చేసిందట. భాషతో సంబంధం లేకుండా కొన్ని కథలు ఉంటాయి. అవి మనసుని బరువెక్కేలా చేస్తాయి. వీలుంటే మీరు ఆ సినిమా చూడండి అంటుంది కళ్యాణి ప్రియదర్శన్. ఇంతకీ ఆమె  చూసిన సినిమా ఏంటి అంటే.. మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7. ఈ సినిమా చూసిన కళ్యాణి చాలా ఎమోషనల్ అయ్యిందట. కన్నీళ్లు కూడా పెట్టుకుందని తెలుస్తుంది. తన ట్విట్టర్ ఖాతాలో ఎప్పుడు మరో సినిమా గురించి ప్రస్తావించని అమ్మడు ఈ సినిమా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందని అంటుంది. 

 

హలొ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శిన్ చిత్రలహరి, రణరంగం సినిమాలు చేసింది. తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న కళ్యాణి సినిమాలు చూసి ఏడ్చింది అంటే ఆమెది ఎంత సున్నితనమైన మనసో అర్ధం చేసుకోవచ్చు. మరి కళ్యాణి ఇంతగా చెబుతుంది కాబట్టి ఆ టర్కీ సినిమా మీద మీరు ఒక లుక్కేయండి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: