ఈ మ‌ధ్య కాలంలో బుల్లి తెర యాంక‌ర్లు హీరోలు హీరోయిన్లు అయిపోవ‌డం తెలిసిన విష‌య‌మే. ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. యాంక‌ర్ల‌లో మంచి ఫేమ‌స్ అన్న పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అయ్యాడు. `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` అనే సినిమాతో హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుద్దా అని ఎంతో ఆశ‌క్తితో ఎదురు చూస్తున్నాడు. 

 

అనుకోకుండా క‌రోనా రావ‌డంతో అంద‌రూ టెన్ష‌న్‌లో ప‌డ్డార‌నే చెప్ప‌లి. ప్ర‌తి ఒక్క‌రు క‌రోనాతో ఏం చేయాలో కూడా అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. సినిమాలు రిలీజులు అన్నీ ఎక్క‌డివ‌క్క‌డ ఆగిపోయాయి. షూటింగ్‌లు లేవు ఏమీ లేక సినీ ప్ర‌పంచ‌మంతా ఒక్క‌సారిగా ఆగిపోయి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. సినిమా అంతా పూర్తియింది. 25న రిలీజ్ అని యాడ్‌లు కూడా ఇచ్చేశారు. కావాల్సినంత ప్ర‌చారం కూడా చేసేశారు. ఇంత‌లో పిడుగులాంటి వార్త క‌రోనా మ‌హ‌మ్మారిలా మారి ప్రాణాల్ని హ‌రిస్తోంద‌ని దీంతో రిలీజ్ ప‌రిస్థితి ఏంట‌ని సందిగ్ధంలో ప‌డిపోయారు చిత్ర నిర్మాత ఎస్వీబాబు. కరోనా క‌నిక‌రిస్తేనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. లేదంటే మ‌రో రెండు నెల‌లైనా పోస్ట్ పోన్ చేయ‌క త‌ప్ప‌దు. అప్పుడు వ‌చ్చినా ప్ర‌దీప్ మ‌ళ్లీ మొద‌టి నుంచి ప్ర‌చారం మొద‌లుపెట్టాల్సిందే. తొలి సినిమాకే ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్త‌డంతో ప్ర‌దీప్ త‌ల ప‌ట్టుకుంటున్నాడ‌ట‌. అన్న‌ట్టు ఈ చిత్రంలోని `నీలి నీలి ఆకాశం..` ఇప్ప‌టికే యూట్యూబ్‌లో 70 మిలియ‌న్ వ్యూస్‌ని దాటేసి అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని సాంగ్స్ రికార్డ్ పై క‌న్నేసింది.

 

సాంగ్ హిట్ అయింది. ఇక సినిమా జాత‌కం ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఈ క‌రోనా గోల ఏంట్రా బాబు అని ప్ర‌దీప్ త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ట‌. అలాగే ఈ చిత్రం మ‌ళ్ళీ ఎప్పుడు విడుద‌ల‌వుద్దో చిత్ర యూనిట్ వేరే తేది కూడా ప్ర‌క‌టించ‌వ‌ల‌సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: