పూజాహెగ్డే... ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు. సినీ ఇండస్ట్రీలో సెక్సీ సైరన్ గా పిలవబడే పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో, వరుస విజయాలతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఎక్స్‌పోజింగ్ చేయడంలో కూడా ఒక్కొక్క హీరోయిన్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ కూడా తనదైన శైలిలో అందాలు ఆరబోస్తూ ఉంది. సినీ ఇండస్ట్రీలో అడ్డుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు పూజా నటించిన ప్రతీ సినిమాలో ఎక్స్‌పోజింగ్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య రిలీజైన 'అలవైకుంఠంపురంలో' సినిమాలో అమ్మడి తొడల మీదే ఫోకస్ చేసి సినిమా నడిపించారంటే అర్థం చేసుకోవచ్చు పూజా ఎక్స్‌పోజింగ్ గురించి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎక్స్‌పోజింగ్ తన మొదటి అస్త్రంగా వాడుకుంటూనే ఉంది. నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

 

సోషల్ మీడియాలలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. తన అందాలను ఎరగా వేస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ హాట్ హాట్ ఫోటోలను చూసిన యువత 'వాట్ ఏ బ్యూటీ … నీ అందానికి నేను ఫీదా అయిపోయాను.. నాతో ఒక్కసారి డేట్ కి వస్తావా మై డియర్ పూజా' అంటూ, 'నీ తొడలు పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు'...అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు.

 

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఆమె ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ఓ డియర్' (పేరు పరిశీలనలో ఉంది), అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్' సినిమాలలో నటిస్తుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన 'కబీ ఈద్‌ కబీ దివాలీ’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ మరిన్ని అవకాశాలు చేజిక్కించుకొని టాప్ లోనే కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: